
YS Jagan : అడ్డంగా దొరికిన వై ఎస్ జగన్ ?
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి చాలా రోజులు అవుతున్నా ఆ ఓటింగ్ జరిగిన తీరు మీద మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా ప్రముఖ వెబ్సైట్ ది వైర్ లో పరకల ప్రభాకర్ రాసిన ఒక కథనం ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేలా చేస్తోంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటా ప్రకారమే ఆయన కొన్ని విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. సాధారణంగా ఎన్నికల రోజు సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత క్యూ లైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఇస్తారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో ఐదు గంటల తర్వాత ఏకంగా పన్నెండున్నర శాతం ఓటింగ్ అదనంగా నమోదు అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐదు గంటలకే గేట్లు వేసేసినా కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా వేల సంఖ్యలో బూతుల్లో ఓట్లు పడటం వెనుక ఏదో మాయాజాలం జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి.
YS Jagan : 2024 లో జగన్ ఓటమి వెనక రహస్యం లీక్ .. పోలింగ్ పూర్తయిన రాత్రి ఏం జరిగింది ..?
పరకల ప్రభాకర్ అందించిన గణాంకాల ప్రకారం రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తెల్లవారుజామున రెండు గంటల మధ్యలో దాదాపు పదిహేడు లక్షల మంది ఓటర్లు ఓటు వేశారట. అంటే ఒక్కో నిమిషానికి సగటున నలుగురు ఓటు వేసినట్టు లెక్క వస్తోంది. ఒక మనిషి ఓటు వేయాలంటే అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండింటికీ కలిపి వివిప్యాడ్ స్లిప్పులు రావడానికే పద్నాలుగు సెకన్ల సమయం పడుతుంది. మళ్ళీ ఆ ఓటర్ రిజిస్టర్ లో సంతకం చేసి సిరా గుర్తు వేయించుకుని కంపార్ట్మెంట్ లోకి వెళ్లి ఓటు వేయడానికి కచ్చితంగా అర నిమిషం పైన పడుతుంది. కానీ ప్రతి పదిహేను సెకన్లకు ఒక ఓటు ఎలా పడిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇది మనుషులు వేసిన ఓట్లా లేక సిస్టం లో సాఫ్ట్వేర్ ద్వారా సృష్టించిన అదృశ్య ఓట్లా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. కనీసం ఆ సమయంలో ఓటర్లు క్యూ లైన్లలో ఉన్నట్టు ఎక్కడా మీడియాలో కూడా వార్తలు రాలేదు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ఫార్మ్ ఇరవై మీద రిటర్నింగ్ ఆఫీసర్ తో పాటు అబ్జర్వర్ సంతకం కూడా ఉండాలి. కానీ పరకల ప్రభాకర్ పరిశీలించిన చాలా పత్రాల మీద అబ్జర్వర్ సంతకాలే లేవని తెలుస్తోంది. వైఎస్ఆర్సిపి నాయకులు ఐదు గంటల తర్వాత జరిగిన ఓటింగ్ వివరాలు మరియు వెబ్ క్యాస్టింగ్ వీడియోలు అడిగినా కూడా ఎన్నికల కమిషన్ వాటిని ఇవ్వకపోవడం మరియు చాలా డేటాను అప్పట్లోనే డిలీట్ చేయడం చూస్తుంటే ఏదో పెద్ద కుట్ర జరిగిందని అనిపిస్తోంది. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందని ఆయన చాలా ధీమాగా ఉన్నారు. కానీ ఈ ఓటింగ్ లెక్కలు చూస్తుంటే ప్రజలు ఇచ్చిన తీర్పు కంటే కూడా టెక్నాలజీ ద్వారా జరిగిన మార్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా అంత వేగంగా ఓట్లు పడటం సాధ్యం కానప్పుడు ఈ ఎన్నికల ఫలితాలను ఏమని పిలవాలో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా తలలు పట్టుకుంటున్నారు. మున్ముందు ఈ విషయంలో మరిన్ని సంచలన నిజాలు బయటకు వస్తాయని అంతా ఎదురుచూస్తున్నారు.
Egg : గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారంగా భావిస్తారు. ముఖ్యంగా ప్రోటీన్ కోసం గుడ్లను చాలా మంది…
No Sugar : ప్రస్తుతం చాలామంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల…
SRH vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, నిన్న జరిగిన చెన్నై…
Sunrisers Hyderabad : ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండగా ప్లేఆఫ్స్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. ఈ…
Grapes Vs Bananas : డయాబెటిస్ ఉన్నవారు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్లు తినేటప్పుడు…
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…
Heart Attack : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
This website uses cookies.