
Vemireddy Prashanthi Reddy : వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరారు .. కాసేపటికే బిగ్ షాక్..!!
Vemireddy Prashanthi Reddy : నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రభావం చూపగల రాజకీయ నాయకులలో వేమిరెడ్డి కుటుంబం ఒకటి. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం ఫ్యామిలీ పార్టీ వదిలి వెళ్ళిపోతున్న తరుణంలో రాజ్యసభ టికెట్ ఇస్తామని చెప్పినా పార్టీని వీడుతామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీసుకున్న అతిపెద్ద నిర్ణయం టీడీపీ లో జాయిన్ అవ్వడం. వైఎస్ జగన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి టీటీడీలో కీలకమైన పదవి ఇచ్చారు. అయినా కూడా ఆమె దానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ లోకి చేరారు. ఇక టీడీపీ నెల్లూరు ను క్లీన్ స్వీప్ గా ఓడిస్తామని చెప్పడంతో వేమిరెడ్డి ఫ్యామిలీ టీడీపీలోకి చేరినట్లు టాక్ వినిపిస్తుంది. మరోపక్క పల్నాడు జిల్లాలో లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి జాయిన్ అవ్వబోతున్నట్లు సమాచారం. అలాగే వసంత కృష్ణ ప్రసాద్ కూడా టీడీపీలోకి చేరారు.
ఈ మూడు చీలికలు కూడా వైసీపీకి గట్టి షాక్ అని చెప్పాలి. లావు కృష్ణదేవరాయకు ఎంపీ టికెట్ ఇస్తామని అది వేరే చోట ఇస్తామని చెప్పిన ఆయన అందుకు అంగీకరించకపోవడంతో టీడీపీ లోకి చేరారని అంటున్నారు. వేమిరెడ్డి కి రాజ్యసభ టికెట్ ఇస్తామన్నా, కాదనుకొని టీడీపీలోకి చేరడం వైసీపీకి పెద్ద షాక్ అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు కలిసి పని చేయబోతున్నారని టీడీపీ నుంచి టాక్ వినిపిస్తుంది. ఇక వేమిరెడ్డి కుటుంబానికి వైయస్ జగన్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే ఎందుకు ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ వచ్చిందని చర్చనీయాంశంగా మారింది. వేమిరెడ్డి పార్టీని విడిపోయినప్పుడు వైయస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని పార్టీ శ్రేణులు అంటున్నారు. వేమిరెడ్డి కోసం వైయస్ జగన్ అనిల్ యాదవ్ ను నర్సాపురం కి షిఫ్ట్ చేయాల్సింది పరిస్థితి వచ్చింది అయినా కూడా వేమిరెడ్డి పార్టీని వీడడంతో వైయస్ జగన్ తీవ్ర ఆవేదన చెందడం జరిగింది.
అందుకే విజయసాయిరెడ్డిని నెల్లూరు నుంచి పోటీ చేయించడానికి వైసీపీ ఇటీవల ప్రకటించింది కూడా . ఇటువంటి పరిస్థితుల్లో నెల్లూరు ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు అనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే పార్టీ మారిన వాళ్ళకి లోకల్ క్యాడర్ నుంచి అనుకూలత లేదని అంటున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనుచరులు, పార్టీ కార్యకర్తలు టీడీపీలోకి చేరమని వైసీపీలోనే ఉంటామని కరాకండిగా చెబుతున్నారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఇబ్బందిగా మారింది. తమ క్యాడర్ పార్టీ కార్యకర్తలు తమతోపాటు టిడిపిలోకి వస్తారని అనుకున్న తరుణంలో క్యాడర్ కార్యకర్తలు వైసీపీలోనే ఉంటామని కరాకండిగా తేల్చి చెప్పారు దీంతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెద్ద షాక్ తగిలినట్లు అయింది.
Crimes : ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. కోపం, పగ, అనుమానం వంటి కారణాలతో సన్నిహితులనే…
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళగ…
IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత రసవత్తర దశకు చేరుకుంది. మొత్తం 48 లీగ్…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. దళపతి…
Night Heat Stroke : సాధారణంగా వడదెబ్బ అనగానే మనందరికీ మండుటెండలు, మధ్యాహ్నపు వేడి గాలులు మాత్రమే గుర్తొస్తాయి. పగటిపూట…
Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…
భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…
AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…
Husband Wife : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలు, ఓట్ల…
IPL 2026 SRH : సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులారా.. ఆరెంజ్ ఆర్మీ మద్దతుదారులారా.. సిద్ధంగా ఉండండి! మీ గుండెల్లో ఆశలు…
Curd : భానుడి భగభగలకు అల్లాడిపోతున్న తరుణంలో, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పెరుగు, మజ్జిగ లేదా లస్సీలను ప్రతి ఒక్కరూ…
This website uses cookies.