
Vemireddy Prashanthi Reddy : వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరారు .. కాసేపటికే బిగ్ షాక్..!!
Vemireddy Prashanthi Reddy : నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రభావం చూపగల రాజకీయ నాయకులలో వేమిరెడ్డి కుటుంబం ఒకటి. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం ఫ్యామిలీ పార్టీ వదిలి వెళ్ళిపోతున్న తరుణంలో రాజ్యసభ టికెట్ ఇస్తామని చెప్పినా పార్టీని వీడుతామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీసుకున్న అతిపెద్ద నిర్ణయం టీడీపీ లో జాయిన్ అవ్వడం. వైఎస్ జగన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి టీటీడీలో కీలకమైన పదవి ఇచ్చారు. అయినా కూడా ఆమె దానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ లోకి చేరారు. ఇక టీడీపీ నెల్లూరు ను క్లీన్ స్వీప్ గా ఓడిస్తామని చెప్పడంతో వేమిరెడ్డి ఫ్యామిలీ టీడీపీలోకి చేరినట్లు టాక్ వినిపిస్తుంది. మరోపక్క పల్నాడు జిల్లాలో లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి జాయిన్ అవ్వబోతున్నట్లు సమాచారం. అలాగే వసంత కృష్ణ ప్రసాద్ కూడా టీడీపీలోకి చేరారు.
ఈ మూడు చీలికలు కూడా వైసీపీకి గట్టి షాక్ అని చెప్పాలి. లావు కృష్ణదేవరాయకు ఎంపీ టికెట్ ఇస్తామని అది వేరే చోట ఇస్తామని చెప్పిన ఆయన అందుకు అంగీకరించకపోవడంతో టీడీపీ లోకి చేరారని అంటున్నారు. వేమిరెడ్డి కి రాజ్యసభ టికెట్ ఇస్తామన్నా, కాదనుకొని టీడీపీలోకి చేరడం వైసీపీకి పెద్ద షాక్ అని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు కలిసి పని చేయబోతున్నారని టీడీపీ నుంచి టాక్ వినిపిస్తుంది. ఇక వేమిరెడ్డి కుటుంబానికి వైయస్ జగన్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే ఎందుకు ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ వచ్చిందని చర్చనీయాంశంగా మారింది. వేమిరెడ్డి పార్టీని విడిపోయినప్పుడు వైయస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని పార్టీ శ్రేణులు అంటున్నారు. వేమిరెడ్డి కోసం వైయస్ జగన్ అనిల్ యాదవ్ ను నర్సాపురం కి షిఫ్ట్ చేయాల్సింది పరిస్థితి వచ్చింది అయినా కూడా వేమిరెడ్డి పార్టీని వీడడంతో వైయస్ జగన్ తీవ్ర ఆవేదన చెందడం జరిగింది.
అందుకే విజయసాయిరెడ్డిని నెల్లూరు నుంచి పోటీ చేయించడానికి వైసీపీ ఇటీవల ప్రకటించింది కూడా . ఇటువంటి పరిస్థితుల్లో నెల్లూరు ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు అనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే పార్టీ మారిన వాళ్ళకి లోకల్ క్యాడర్ నుంచి అనుకూలత లేదని అంటున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనుచరులు, పార్టీ కార్యకర్తలు టీడీపీలోకి చేరమని వైసీపీలోనే ఉంటామని కరాకండిగా చెబుతున్నారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఇబ్బందిగా మారింది. తమ క్యాడర్ పార్టీ కార్యకర్తలు తమతోపాటు టిడిపిలోకి వస్తారని అనుకున్న తరుణంలో క్యాడర్ కార్యకర్తలు వైసీపీలోనే ఉంటామని కరాకండిగా తేల్చి చెప్పారు దీంతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెద్ద షాక్ తగిలినట్లు అయింది.
Indian : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్ వంటి…
Rain Alert : ఎండలు తీవ్రంగా మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంత ఉపశమనం లభించనున్నట్లు వాతావరణ శాఖ…
Ration Card : తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఊరట కలిగించే నిర్ణయం…
KV School Jobs : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా కేంద్ర…
Vivo 5G Smartphone : భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో వివో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. స్టైలిష్…
PAN Card : కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియలో ముఖ్యమైన మార్పులను ప్రకటించింది. 2026–27 ఆర్థిక సంవత్సరాన్ని…
Gold Silver Price 21 March 2026 : బంగారం కొనాలనుకునే వారికి, పసిడి ప్రియులకు ఇది నిజంగా పండుగ…
Karthika Deepam 2 March 21st 2026 Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్…
Watermelon : వేసవి కాలం అంటేనే మండే ఎండలు, దాహం, అలసట. ఇలాంటి సమయంలో శరీరాన్ని చల్లబరచడంలో పుచ్చకాయ కీలక…
Mint Tea : నేటి వేగవంతమైన జీవనశైలి, అసమయ భోజనపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాలతో చాలా మంది జీర్ణ…
Chanakyaniti : మనిషి జీవితం అనేది అనేక అనుభవాల సమాహారం. ఇందులో సరైన నిర్ణయాలు తీసుకుంటే జీవితం సుఖంగా సాగుతుంది.…
War : Middle East war ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే మానవాళి మరో మహా యుద్ధం అంచున నిలబడిందా…
This website uses cookies.