Venkat Reddy : ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు చాలా జరిగాయి అని అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జగన్ సర్కార్ పాలనలో వైఎస్సార్సీపీ పెద్దల ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి, అన్నీ తానై వ్యవహరించారనే ఫిర్యాదులు ఎదుర్కొంటున్న గనులశాఖ పూర్వ ఎండీ వీజీ వెంకటరెడ్డిపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. ఆయన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద ఏసీబీ అనుమతి తీసుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. వెంకట రెడ్డి ఆచూకీ కోసం మాతృశాఖ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థకు ప్రభుత్వం లేఖ కూడా రాసింది..
తమకు వెంకట రెడ్డి ఆచూకీ తెలియదని ప్రభుత్వానికి కోస్ట్ గార్డ్ సంస్థ సమాధానం ఇచ్చింది. జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ పెద్దల ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి, అన్నీ తానై వ్యవహరించారనే ఫిర్యాదులు ఎదుర్కొంటున్న గనులశాఖ పూర్వ ఎండీ వీజీ వెంకటరెడ్డిపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. ఆయన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద అనుమతి తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు, టెండర్లు, ఒప్పందాలు ఇలా అన్ని దశల్లోనూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం పెద్దలు చెప్పినట్లు తల ఊపుతూ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన వెంకటరెడ్డి అరెస్టు భయంతో ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఏసీబీ అధికారులు అంటున్నారు.
గనుల లీజుల కేటాయింపు, ఇసుక టెండర్ల ఖరారు, ఒప్పందాల్లో ఆయన పలు నిబంధనలు ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే ఏసీబీ నిర్ధారించింది. వాటికి సంబంధించిన దస్త్రాలను పరిశీలిస్తోంది. ఇసుక గుత్తేదారు సంస్థ జేపీ పవర్ వెంచర్స్ ప్రభుత్వానికి రూ.800 కోట్లు బకాయి ఉన్నప్పటికీ ఆ సంస్థకు ఆయన ఎన్వోసీ ఎలా జారీ చేశారు? ఎవరి ఆదేశాల మేరకు చేశారనే వివరాలను సేకరిస్తోంది. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థల ఉల్లంఘనల్లోనూ ప్రమేయం ఉంది. దీంతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీల్లో తప్పుడు సమాచారంతో కూడిన అఫిడవిట్ల సమర్పణ తదితర అంశాలపై అవినీతి నిరోధక శాఖ ప్రాథమిక విచారణ కొనసాగిస్తోంది. సస్పెన్షన్ నోటీసులు అందజేయడానికి గనుల అధికారులు వెళ్లినా సరే ఆయన నివసించే చిరునామాల్లో ఎక్కడా అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో ఆయన కదలికలపై కూడా ఏసీబీ గురిపెట్టింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.