Venu Swamy : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వేణు స్వామి పేరు విపరీతంగా వినిపిస్తోంది. అయితే ఒకప్పుడు సెలబ్రిటీల జాతకాలని బయట పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వేణు స్వామి ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు క్రికెట్ సెలబ్రిటీల జాతకాలని కూడా చెబుతూ వైరల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ కప్ గెలుస్తుంది అని చెప్పిన వేణు స్వామి తాను చెప్పినట్లుగా జరగకపోవడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యారు. ఇక ఈ ట్రోలింగ్ కు స్పందించిన వేణు స్వామి నిజానిజాలను బయటపెడుతూ తాను కచ్చితంగా గెలుస్తుందని చెప్పలేదంటూ తెలియజేశారు.
ఇక ఇది ఇలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన వేణు స్వామి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని తెలియజేసిన వేణు స్వామి మరోసారి అదే విషయం గురించి మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో జగన్ ది పై చేయి అవుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా జైలుకు వెళ్లి వచ్చిన వారే. వారిద్దరికి ప్రస్తుతం బుధ మహర్దశ నడుస్తుందని తెలియజేశారు. అలాగే చంచల్ గూడ జైలు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులని ఇచ్చిందని ఈ సందర్భంగా వేణు స్వామి తెలిపారు.
ఇక ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు జాతకాల ఆధారంగా మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తే వీరిద్దరూ కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలుస్తారని అంటే దాదాపు 15 సంవత్సరాలు వీరిద్దరూ ముఖ్య మంత్రి హోదాలో ఉంటారని వేణు స్వామి తెలిపారు. అయితే ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. , ఈ నేపథ్యంలోనే వారి పదవిని కాపాడుకుంటూ మంచి పనులు చేస్తే మూడుసార్లు ముఖ్యమంత్రి అవుతాను పొందుతారని తెలిపారు. దీంతో ప్రస్తుతం వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.