
Vijayasai Reddy : విజయసాయిరెడ్డి వైసీపీ పై విమర్శలు చేయడం వెనుక కారణాలు ఏంటి..?
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. వైసీపీకి గుడ్బై చెప్పి పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన ఆయన తిరిగి అదే పార్టీపైనే విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది. జగన్పై వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలు చేయకున్నా, ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్లనే పార్టీని వీడినట్లు చెప్పడం పార్టీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇన్నాళ్లు జగన్తో సన్నిహితంగా ఉండి, కీలక వ్యవహారాల్లో భాగస్వామిగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు కోటరీపై ఆరోపణలు చేయడం శోచనీయమని పార్టీ నాయకులు అంటున్నారు.
Vijayasai Reddy : విజయసాయిరెడ్డి వైసీపీ పై విమర్శలు చేయడం వెనుక కారణాలు ఏంటి..?
విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్… విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. పార్టీ కోసం 15 ఏళ్లుగా కష్టపడిన కార్యకర్తలే జగన్ కోటరీ అని, తాను నిన్నటివరకు ఆ కోటరీలోనే ఉండి ఇప్పుడు విమర్శలు చేయడం విపరీతమని అన్నారు. చంద్రబాబునాయుడి టీడీపీలో కోటరీ లేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించాలన్నారు. రాజకీయాల్లో కోటరీలు ఉండటం సహజమేనని, కానీ దాని గురించి విమర్శలు చేయడం భావ్యం కాదని అన్నారు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడిన తర్వాత మరింత బాధ్యతగా మాట్లాడతారని అనుకున్నామని, కానీ ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని గుడివాడ అన్నారు.
విజయసాయిరెడ్డి భవిష్యత్ రాజకీయ ప్రస్థానం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తొలుత ఆయన రాజకీయాలకు పూర్తిగా గుడ్బై చెప్పినట్లు చెప్పినా తాజా విమర్శలు చూస్తే మరో రాజకీయ పార్టీ వైపు అడుగులు వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ రెండోసారి సీఎం అయితే విజయసాయిరెడ్డి ఇలాగే మాట్లాడేవారా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్ఫోన్ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
This website uses cookies.