Categories: andhra pradeshNews

Nara Lokesh : ఏపీకి బాబు బ్రాండ్ తీసుకొస్తుంటే.. వైసీపీ చెడగొడుతుందంటూ లోకేష్ ఫైర్..!

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌‌ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్‌ విమర్శించారు. రేపో మాపో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిపోతుందంటూ సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఈ మెయిల్ చేశారని తెలిపారు. మురళీకృష్ణకు వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ ఈ మెయిళ్లు పెట్టారని వివరించారు. వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ సంస్థతో మురళీకృష్ణకు సంబంధమున్నట్లు తెలిసిందన్నారు. ఇదే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని ఆయన అభివర్ణించారు.

Nara Lokesh : ఏపీకి బాబు బ్రాండ్ తీసుకొస్తుంటే.. వైసీపీ చెడగొడుతుందంటూ లోకేష్ ఫైర్..!

Nara Lokesh : ఏపీలో ప్రభుత్వం మారుతుందంటూ సింగపూర్ అధికారులకు వైసీపీ నేత మెయిల్

ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఏపీ బ్రాండ్‌ను తిరిగి సాధించేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున డేటా సెంటర్లు రానున్నాయని తెలిపారు. ఆ క్రమంలో రాష్ట్రంలో టాటా ఇన్నోవేషన్‌ హబ్స్‌ ఏర్పాటు కానుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లస్టర్లుగా విభజించి.. అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణపై దృష్టి సారించినట్లు వివరించారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయన తర్వాత ఏపీకి బ్రాండ్‌ తిరిగొచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ హయాంలో ఏకపక్షంగా సింగపూర్‌ ఒప్పందాలు రద్దు చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో సింగపూర్‌ ప్రభుత్వంపై అవినీతి ముద్ర వేశారని గుర్తు చేశా

రాజధాని అమరావతి సంయుక్త అభివృద్ధికి సింగపూర్‌ అంగీకారం తెలిపిందన్నారు. సింగపూర్‌ పర్యటనలో రూ. 45 వేల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. సింగపూర్‌లో నాలుగు రోజుల్లో సీఎం చంద్రబాబు 26 మీటింగ్స్‌ నిర్వహించారని వివరించారు. 19 వన్‌ టూ వన్‌ మీటింగ్స్‌లో తాను సైతం పాల్గొన్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌, డేటా సెంటర్స్‌ ఏర్పాటుకానున్నాయని చెప్పారు. విశాఖను ఐటీ పటంలో పెట్టాలని తాము నిర్ణయించామని తెలిపారు. టీసీఎస్‌కు రూ.99 పైసల చొప్పున భూమి కేటాయించామని మంత్రి నారా లోకేష్ వివరించారు.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

4 days ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

4 days ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

4 days ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

4 days ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

5 days ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

5 days ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

5 days ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

5 days ago