Vijayasai Reddy : ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాజ్యసభలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ 5వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈసందర్భంగా మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.. గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం జగన్ నేతృత్వంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. గిరిజనుల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా తమ మద్దతు ఉంటుందని.. ఏపీలో తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తోందని.. అలాగే దేశమంతా గిరిజనుల మేలు కోసం ఎలాంటి చర్యలు చేపట్టినా వాళ్లకు వైసీపీ మద్దతు ఉంటుందని విజయసాయిరెడ్డి తెలిపారు.
అయితే.. టీడీపీ సభ్యులు రాజ్యసభలో వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను వైసీపీ ఎంపీ తిప్పికొట్టారు. జగన్ ఏపీలో సీఎంగా అధికారం చేపట్టాక గిరిజనుల అభ్యున్నతి కోసం చేపట్టిన పలు పథకాల గురించి చెప్పుకొచ్చారు. ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని గిరిజనులు ఉండే ప్రాంతంలో నెలకొల్పేందుకు సీఎం జగన్ ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. దాని కోసం ప్రధాని మోదీనే జగన్ ఒప్పించారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం కావాల్సిన వందలాది ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వం సమకూర్చిందని.. ఇప్పటికే గిరిజన యూనివర్సిటీ భవనాలు, క్యాంపస్ నిర్మాణం కూడా ప్రారంభం అయిందని స్పష్టం చేశారు.
అలాగే.. పాడేరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా చేపట్టామని చెప్పుకొచ్చారు. అంతే కాదు.. పోడు వ్యవసాయమే చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద పోడు పట్టాలు పంపిణీ కార్యక్రమానికి అప్పట్లో వైఎస్సార్ శ్రీకారం చుట్టగా.. దాన్ని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పున:ప్రారంభించారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.