
MP Sujana choudary reverse plan on ys jagan and narendra modi friendship
ys jagan ఏపీలో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ పతాక స్థాయిలో చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆంద్రుల హక్కు.. సామాజిక హక్కు.. సెంటిమెంట్ అయిన విశాక ఉక్కు కర్మాగారంను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్దం అవుతుంది. ఈ నిర్ణయంతో మరోసారి ఏపీలో బీజేపీ కి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఏపీలో బీజేపీ నడక ప్రారంభిస్తున్న సమయంలో మళ్లీ ఈ నిర్ణయం ఆ పార్టీకి పెద్ద ప్రాణ సంకటం అన్నట్లుగా మారింది. వైకాపా కు కూడా ఈ నిర్ణయం వల్ల చాలా పెద్ద డ్యామేజీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలోనే ఈ నిర్ణయం జరడం వల్ల ముందు ముందు ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఈ విషయాన్ని తెరపైకి తీసుకు వచ్చి విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో సుజనా చౌదరి శకుని పాత్ర పోషిస్తున్నట్లుగా అనుమానాలు వస్తున్నాయి.
MP Sujana choudary reverse plan on ys jagan and narendra modi friendship
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విశాక స్టీల్ ప్లాంట్ ప్రవేట్ కు నిర్ణయం తీసుకుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం దాన్ని సమర్థిస్తున్నట్లుగా కాకుండా తాము కేంద్రంతో పోరాటం చేస్తాం. అలా అయితే రాజీనామాలు చేస్తాం అంటూ ఆ నిర్ణయాన్ని ఆపేస్తాం అంటూ కొంత కాలం వరకు ప్రకటనలు చేయాలి. అప్పుడు కాని కొంతలో కొంత అయినా రాష్ట్ర బీజేపీ నాయకులపై నమ్మకం కలుగుతుంది. అలా కాదని కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదే. ఎవరు ఏం చేసుకున్నా చేసినా కూడా ఆ నిర్ణయం ఆగదు అంటే రాష్ట్ర ప్రజలు బీజేపీపై యుద్దంకు దిగినా ఆశ్చర్యం లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అదే పని చేస్తున్నాడు. మేము కేంద్రంతో మాట్లాడి నిర్ణయం వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం అంటు ఉంటే సుజనా చౌదరి మాత్రం అది సాధ్యం కాదు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అవ్వాల్సిందే అంటున్నాడు.
మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన విశాఖ ఉక్కు ప్రైవేట్ నిర్ణయంను ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. కేంద్రం వద్దకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ బృందం వెళ్లిందని సమాచారం అందుతోంది. సీఎం వైఎస్ జగన్ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి విశాఖ ఉక్కు విషయమై లేఖ రాయడం జరిగింది. అయితే సుజనా చౌదరి మాత్రం అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అంటూ కేంద్రంకు మద్దతు తెలుపుతున్నాడు. దాంతో మోడీ తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశం లేదు. తద్వార బీజేపీ మరియు వైకాపాల మద్య వైరం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. బీజేపీలో ఉండి సొంత పార్టీకి మరియు వైకాపాకు దూరం పెంచేలా చూడటంతో పాటు తెలుగు దేశం పార్టీకి సుజనా చౌదరి మంచి చేసేలా ప్లాన్ చేస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Mint : వేసవి రుతువులో పుదీనా చట్నీ, పుదీనా నీరు ప్రతి ఇంట్లో విరివిగా ఉపయోగించబడుతుంది. అందులోని చల్లనిచ్చే లక్షణం…
Pomegranate Juice : “ఒక దానిమ్మ పండు వంద వ్యాధులను నయం చేస్తుంది” అనే సామెత మనకు తెలిసిందే. అయితే…
Chanakya Niti : వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆచార్య చాణక్యుడు ప్రతిపాదించిన జీవన విధానాలు, వ్యూహాలు నేటి ఆధునిక…
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
This website uses cookies.