
Rakhi Festival : ఆగస్టు 31 రాఖీ పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారం చేసి తీరాల్సిందే..!
Rakhi Festival : ఆగస్టు 31 రాఖీ పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారం చేసి తీరాల్సిందే.. మరి రాఖీ పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి. అసలు ఎందుకు పరిహారం చేయాలి. అనే విశేషాలు మనం తెలుసుకుందాం… ఆగస్టు 31 రాఖీ పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు ఒక పరిహారం కచ్చితంగా చేసుకోవాలి. ఎందుకు అంటే రాఖీ పౌర్ణిమ ఈసారి అంటే 2023వ సంవత్సరం భద్ర ముహూర్తంలో వచ్చింది. ఈ ముహూర్తంలో రాఖీ కట్టకూడదు. ఒకవేళ మీరు అలా రాఖీ కడితే అతి పెద్ద గండమైతే కనిపిస్తుంది. ఈ రాఖీ పౌర్ణిమ రక్షాబంధనం అంటే సోదరుడు సోదరి అత్యంత పవిత్రంగా వారి యొక్క బంధం కలకాలం నిలవాలని జరుపుకునేటువంటి పండగ. ఇది అన్నకు చెల్లెలు అండగా ఉండాలని చెల్లెలికి అన్నయ్య తోడుగా జీవితాంతం ప్రమాణం చేసుకునే రాఖీ పండుగను జరుపుకుంటారు.
ఆగస్టు 30వ తారీకు శ్రావణ పౌర్ణమి రాత్రి తొమ్మిది గంటల నుండి ఆగస్టు 31 ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఇది ఆగస్టు 31 ఉదయాన్నే ఉషోదయం కాకముందే చేసుకోవాల్సినటువంటి పరిహారం. తల్లి తన కొడుకుల పేర ఈ పరిహారాన్ని చేయాలి. ముందు రోజు రాత్రి మీరు రావి ఆకులను తెచ్చి పెట్టుకోండి. 11 రావి ఆకులను కింద రాలి పడిపోయి ఉన్నటువంటి రావి ఆకులు ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి చక్కగా వాటిని పసుపు నీళ్లతో కడిగి పూజ మందిరంలో ఉంచుకోండి. ఆగస్టు 31 సూర్యోదయం కాకముందే స్నానం చేసి ఈ రావి ఆకుల్ని చక్కగా పసుపు కుంకుమతో అలంకరించండి. అలా సిద్ధం చేసుకున్న రావి ఆకుల్ని తొమ్మిది పోచలు వేసినటువంటి దారంతో ముడి వేయాలి.
Rakhi Festival : ఆగస్టు 31 రాఖీ పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారం చేసి తీరాల్సిందే..!
అయితే ఈ దారాన్ని కొద్దిగా గంధం కలిపినటువంటి నీటిలో తడపాలి. అలా తడిపి పచ్చగా అయినటువంటి ఆ దారాన్ని ఒక్కొక్క రావి ఆకును ముడి వేసుకుంటూ వెళ్ళాలి. అలా 11 రావి ఆకుల్ని కూడా చక్కగా కట్టాలి. ఈ కడుతున్నంతసేపు ముడులు వేస్తున్నంత సేపు మీకు ఎంతమంది కొడుకులైతే ఉన్నారో వారి పేర్లు తలుచుకుంటూ ముడి వేయాలి. ఇలా వేసిన తర్వాత ఆ రావి ఆకుల తోరణాన్ని పూజలో పెట్టి పూజ చేసుకోవాలి. పూజ అయిపోయిన వెంటనే ఆ రావి ఆకుల తోరణాన్ని మీ ఇంటి సింహద్వారం ఏదైతే ఉందో ఆ సింహద్వారానికి కట్టాలి. ఇలా తోరణంలా కట్టుకున్నంత సేపు కూడా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కొడుకుల పేర్లు తలుచుకుంటూ కట్టాలి. ఆ తర్వాత సాంబ్రాణి ధూపం వేయాలి. ఈ విధంగా కచ్చితంగా చేయాలి.
అయితే ఈ పద్ధతి అంతా కూడా సూర్యోదయం కాకుండా నే చేయాలి. ఇలా చేసినట్లయితే మీ కొడుకులకు ఎటువంటి హాని, ఇబ్బందులు, గండాలు అనేవి రావు… వారి అభివృద్ధికి మీరు బాటలు వేసిన వారు అవుతారు.
Modi : భారత్ మరియు ఇరాన్ దేశాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న చమురు మరియు గ్యాస్ సరఫరా వ్యవహారం అంతర్జాతీయంగా…
Revanth Reddy : తెలంగాణ Telangana State రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే…
Summer Business Idea : వేసవి కాలం వచ్చేసింది.. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇలాంటి ఎండల్లో…
PM Kisan 23rd installment : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి, పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం…
Gold Silver Rate April 6th 2026 : గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న పసిడి ధరలకు…
Karthika Deepam 2 April 6th 2026 Episode : స్టార్ మా Star Maa ఛానెల్లో ప్రసారం అవుతూ,…
Summer Buttermilk : ఎండలు మండిపోతున్న వేళ శరీరాన్ని చల్లబరచడానికి మజ్జిగను మించిన పానీయం మరొకటి లేదు. సాధారణంగా మజ్జిగ…
Mango : వేసవి కాలం రాగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండు. అయితే పచ్చి మామిడికాయ మరియు…
Iced Tea Iced Coffee : వేసవి కాలంలో చల్లటి పానీయాలు తాగడం అందరికీ ఇష్టమే కానీ బరువు తగ్గాలని…
Pakistan Iran : గల్ఫ్ యుద్ధం వల్ల చమురు సరఫరా ఆగిపోవడం పాకిస్తాన్ పాలిట పెద్ద శాపంగా మారింది. ఇప్పటికే…
Ration Cards : తెలంగాణలో అనర్హులైన రేషన్ కార్డుదారులపై ప్రభుత్వాలు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యాయి. నిరుపేదల కోసం ఉద్దేశించిన ఉచిత…
Chicken Prices : నాన్ వెజ్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. గత కొద్ది రోజులుగా మండిపోతున్న చికెన్ ధరలు ఎట్టకేలకు…
This website uses cookies.