Home » Devotional » If You Visit These Temples On The Day Of Vinayaka Chavithi Will You Get The Darshan Of Lord Ganesha That Will Fulfill Your Wishes
Devotional

Vinayaka Chavithi : వినాయక చవితి రోజున ఈ ఆలయాలని దర్శిస్తే… మీ కోరికలను తీర్చే గణపతుల దర్శనం…?

Authored By
aruna
The Telugu News | Published on: August 17, 2025, 7:00 am
Advertisement

Vinayaka Chavithi : దేశంలో గణపతికి చెందిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే కొన్ని దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొన్ని స్థల పురాణాలతో, ఆలయాలు నిర్మాణంతోనూ ప్రసిద్ధి చెందాయి. ఈరోజు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఖ్యాతిగాంచిన ఐదు ప్రత్యేక గణపతి ఆలయాలు గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం..

Advertisement

Vinayaka Chavithi : వినాయక చవితి రోజున ఈ ఆలయాలని దర్శిస్తే… మీ కోరికలను తీర్చే గణపతుల దర్శనం…?

గణపతికి చెందిన దేవాలయాలు

ఇండోర్ లోని ఖజ్రానా అనే చిన్న పట్నంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణేష్ దేవాలయం ఉంది. ఇక్కడ గణేశుడి విగ్రహం వెనుక స్వస్తి గుర్తు వేసి మోదకం నైవేద్యంగా పెడితే, తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అన్ని 1735లో కోల్కరాజ వంశానికి చెందిన సామ్రాజని అహల్యాబాయి నిర్మించారు. జాలయానికి వచ్చే భక్తుల ఆలయాన్ని మూడు ప్రదక్షిణలు చేసి తరువాత ఆలయ గోడలకు దారాలు కడతారు. చూస్తే ఆలయ దర్శనం పూర్తీ అయినట్లు పరిగణిస్తారు.ప్రతి బుధవారం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు హారతులు ఇస్తారు. ఈ ఆలయం దేశంలో అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

Advertisement

మధ్యప్రదేశ్ లోని జూనా ప్రాంతంలో దేవాలయం జొన్న చింతమన్ గణేశాలయం సుమారు 1200 సంవత్సరాల నాటి దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. కొలువైన వినాయకుడు భక్తుల సమస్యలను ఫోన్,మొబైల్ లెటర్లతో విని సమస్యను పరిష్కరిస్తాడని ఖ్యాతి. ఈ విషయానికి రుజువు జర్మనీకి చెందిన ఒక భక్తుడు. గణేశునితో మాట్లాడాలని పట్టుబట్టాడని అలా గణపతికి చెవిలో తన సమస్య చెప్పిన ఈ విదేశీ భక్తుడు సమస్య తీరినట్లు వినాయకుడితో మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత తన సమస్య తీరినట్లు తెలిపారని చెబుతారు. అప్పటినుంచి ప్రక్రియ ప్రారంభమైంది. భక్తుడు పూజారి ద్వారా గణేష్ ని దేవునితో మాట్లాడి తన కోరికను తెచ్చుకుంటారు.

రాజస్థాన్లోని రణథంబోర్ కోటలో ఉన్న త్రినేత్ర గణేష దేవాలయం ప్రసిద్ధి చెందిన.పురాతన దేవాలయం. ఈ కోటలో గణేశుడు త్రినేత్రుడు ఇది సుమారు 1000 సంవత్సరాల నాటిది. ఈ ఆలయానికి మహారాజా హర్మీర్ దేవ్ చౌహన్ నిర్మించారు. ఈ ఆలయంలో వినాయకుడు స్వయంగా వెలిసినట్లు చెబుతారు.మండే గణపతి ఆలయం మహారాష్ట్రలోని పూణేలోని అతిపెద్ద గణపతి ఆలయం. ఇక్కడ గణపతి ఆలయాన్ని అఖిల గణపతి మండల అంటారు. దేశ విదేశాల నుండి ఇక్కడ స్వామివారిని దర్శించేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
ఉచ్చి పిల్లయా ఆలయం తమిళనాడులోని తిరుచి నగరంలోని కొండపై ఉంది. ఈ ఆలయం దేశ విదేశాలలో ప్రసిద్ధి చెందింది. భారీ సంఖ్యలో భక్తులు యాలయంలో గణపతిని దర్శించుకుంటారు చైల్డ్ రాజులు పర్వతాలను చదును చేసి ఆలయాన్ని నిర్మించారు. పర్వత శిఖరం కారణంగా ఈ గణేష్ దేవాలయాన్ని హై ఫిళ్ళైయారు అని పిలుస్తారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి