
Utthana Ekadashi : ఉత్తాన ఏకాదశి ప్రాముఖ్యత... ఏ రోజు ఎలా జరుపుకోవాలంటే..!
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి సోమవారాలు కార్తీక పౌర్ణమి వంటి ముఖ్యమైన రోజులు ఉన్నాయి. అయితే కార్తీకమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్తన ఏకాదశి మరియు ప్రబోధిని ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం క్రోధినామా సంవత్సరంలో శ్రీమహావిష్ణు యోగా నిద్ర నుండి ఈరోజు మేల్కొంటాడు. ఈ ఏడాది కార్తీక మాసం శుక్ల ఏకాదశి తిధి నవంబర్ 12వ తేదీన ఉపవాసం చేయడానికి శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. ఇక ఈ రోజున శ్రీ మహా విష్ణువుని పూజించడం మరియు ఉపవాసం పాటించడం వలన సర్వపాపాలు నశిస్తాయి. అదేవిధంగా ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే వెయ్యి అశ్వయోధ యాగాలు వంద రాజసూయ యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు.
పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు యోగానిద్ర నుండి మేల్కొన్న రోజు నుండి శుభకార్యాలు మొదలవుతాయి. అయితే ఆర్థిక శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుని నిద్ర నుండి లేపేందుకు విష్ణు లోకానికి బ్రహ్మాది దేవతలతో పాటుగా మహర్షి కూడా వెళ్తారు. ఇక ఆ రోజున అందరూ కలిసి భజనలు చేసుకుంటూ నాట్యం చేస్తూ కీర్తనలు మృదంగం వాయిద్యాలతో స్వామిని మేల్కొలుపుతారు. అనంతరం పరమేశ్వరుడు విష్ణుమూర్తిని ఆర్జించి హారతి ఇస్తుండగా బ్రహ్మ వేదాలను పటించారు . ఇక ఆ రోజు నుండి పూజ కార్యక్రమాలలో హారతి ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఉత్తన ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఆచరించడం వలన జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. అలా మరుసటి రోజు ద్వాదశి రోజున ఆలయాలలో ఇళ్లల్లో తులసి వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున చేసే దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఉత్తన ఏకాదశి రోజున దానధర్మాలు పుణ్యకార్యాలు చేసేవారి ఇంత ధనధాన్యాలుకి లోటు ఉండదని మరియు జీవితంలో సుఖసంతోషాలతో పాటు ఐశ్వర్యానికి లోటు ఉండదని పురోహితులు చెబుతున్నారు.
Utthana Ekadashi : ఉత్తాన ఏకాదశి ప్రాముఖ్యత… ఏ రోజు ఎలా జరుపుకోవాలంటే..!
కార్తీక ఏకాదశి రోజున ఉపవాసాన్ని పాటించి శ్రీ మహా విష్ణుమూర్తిని ఆరాధించడం వలన కోరికలన్నీ నెరవేరుతాయిని చాలామంది భక్తులు నమ్ముతారు. పురాణాలలో మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు ఏకాదశి రోజున వస్త్రాలను వదిలి అంపశయ్యపై శయనించాడు. అటువంటి పవిత్రమైన రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రపరచుకున్న అనంతరం శ్రీ విష్ణు సమర్పించుకుంటూ శ్రీహరి విగ్రహం లేదా ఫోటో ముందు శంఖం గంటలు ఊపుతూ శ్రీ మహా విష్ణువు ఎదుట ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఉపవాసాన్ని విరమించాలి.
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
This website uses cookies.