
vitthal rukmini temple
అక్షయ తృతీయ సందర్బంగా సాధారణంగానే చాలా మంది బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆలయాల్లో దేవుళ్లకు ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తుంటారు. ఇక మహారాష్ట్రలోని ఆ ప్రాంతంలో ఉన్న ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. అయితే స్వామి వారు, అమ్మవారిని వేల సంఖ్యలో మామిడి పండ్లతో అలంకరించడం ఆకట్టుకుంటోంది.
vitthal rukmini temple
మహారాష్ట్రలోని పంధార్పూర్లో ఉన్న విఠల-రుక్మిణీ ఆలయంలో అక్షయ తృతీయ సందర్బంగా స్వామి వారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ ఇద్దరినీ భారీ సంఖ్యలో మామిడిపండ్లతో అలంకరించారు. అందుకు గాను మొత్తం 7000 మామిడి పండ్లు అవసరం అయ్యాయి. ఆ ఆలయంలో ఉన్న ఇతర దేవుళ్లు, దేవతల ఆలయాల్లోనూ విగ్రహాలను మామిడి పండ్లతో అలంకరించారు.
అయితే ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతేడాది కూడా అక్షయ తృతీయ సందర్బంగా ఆలయంలో దేవుళ్లు, దేవతలను 3100 మామిడిపండ్లతో అలంకరించారు. ఇక ఇప్పుడు ఆ సంఖ్యను పెంచారు. అయితే అలంకరణను తీసేశాక ఆ మామిడి పండ్లను హాస్పిటళ్లలో కోవిడ్ బాధితులకు అందజేశారు. అలాగే స్వామి వారు, అమ్మవార్లను పుచ్చకాయలు, యాపిల్ పండ్లు, ఇతర పండ్లతోనూ అలంకరించగా, వాటిని తీసేశాక వాటిని కూడా బాధితులకు పంపిణీ చేశారు. కాగా దేవుళ్లను అలా మామిడి పండ్లతో అలంకరించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.