7000 మామిడిపండ్ల‌తో స్వామివారు, అమ్మ‌వార్ల‌కు అలంక‌ర‌ణ‌.. వైర‌ల్ ఫొటో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

7000 మామిడిపండ్ల‌తో స్వామివారు, అమ్మ‌వార్ల‌కు అలంక‌ర‌ణ‌.. వైర‌ల్ ఫొటో..!

 Authored By maheshb | The Telugu News | Updated on :15 May 2021,4:07 pm

అక్ష‌య తృతీయ సంద‌ర్బంగా సాధార‌ణంగానే చాలా మంది బంగారు ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఆల‌యాల్లో దేవుళ్ల‌కు ప్ర‌త్యేక పూజ‌లను కూడా నిర్వ‌హిస్తుంటారు. ఇక మ‌హారాష్ట్ర‌లోని ఆ ప్రాంతంలో ఉన్న ఆల‌యంలోనూ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అయితే స్వామి వారు, అమ్మ‌వారిని వేల సంఖ్య‌లో మామిడి పండ్ల‌తో అలంక‌రించ‌డం ఆక‌ట్టుకుంటోంది.

vitthal rukmini temple

vitthal rukmini temple

మ‌హారాష్ట్ర‌లోని పంధార్‌పూర్‌లో ఉన్న విఠ‌ల‌-రుక్మిణీ ఆల‌యంలో అక్ష‌య తృతీయ సంద‌ర్బంగా స్వామి వారు, అమ్మ‌వార్ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ఆ ఇద్ద‌రినీ భారీ సంఖ్య‌లో మామిడిపండ్ల‌తో అలంక‌రించారు. అందుకు గాను మొత్తం 7000 మామిడి పండ్లు అవ‌స‌రం అయ్యాయి. ఆ ఆల‌యంలో ఉన్న ఇతర దేవుళ్లు, దేవ‌త‌ల ఆల‌యాల్లోనూ విగ్ర‌హాల‌ను మామిడి పండ్ల‌తో అలంక‌రించారు.

అయితే ఇలా చేయ‌డం కొత్తేమీ కాదు. గ‌తేడాది కూడా అక్ష‌య తృతీయ సంద‌ర్బంగా ఆల‌యంలో దేవుళ్లు, దేవ‌త‌ల‌ను 3100 మామిడిపండ్ల‌తో అలంక‌రించారు. ఇక ఇప్పుడు ఆ సంఖ్య‌ను పెంచారు. అయితే అలంక‌ర‌ణ‌ను తీసేశాక ఆ మామిడి పండ్ల‌ను హాస్పిట‌ళ్ల‌లో కోవిడ్ బాధితుల‌కు అంద‌జేశారు. అలాగే స్వామి వారు, అమ్మ‌వార్ల‌ను పుచ్చ‌కాయ‌లు, యాపిల్ పండ్లు, ఇత‌ర పండ్ల‌తోనూ అలంక‌రించ‌గా, వాటిని తీసేశాక వాటిని కూడా బాధితుల‌కు పంపిణీ చేశారు. కాగా దేవుళ్ల‌ను అలా మామిడి పండ్లతో అలంక‌రించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

maheshb

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది