Anchor Rashmi Gautam Emeotional Dance Performance in Mana OOri devudu Event
Rashmi Gautam : మల్లెమాల చేసే ఈవెంట్లు, వారి కొత్త కొత్త ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి. బుల్లితెరపై మల్లెమాలకు ఎంటర్టైన్మెంట్లో ఎదురులేదన్నది అందరికీ తెలిసిందే. ఏ పండుగైనా సరే ఈటీవీలో ఈవెంట్ వస్తోందంటే.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ ఈ సారి వినాయక చవితి పండుగ ఈవెంట్ అని చెప్పారు. కానీ అందులో వినాయకుడి గురించి తప్పా మిగతాది అంతా ఉంది. అవే పాటలు, అవే మాటలు.. పిచ్చి జోకులు, వెకిలి చేష్టలు కనిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రష్మీ అయితే అందరినీ కట్టిపడేసింది. రష్మీకి ఇది వరకే పెళ్లి అయిందని, డివోర్స్ అంటూ ఏవేవో పిచ్చి పిచ్చి కథనాలు వస్తుంటాయి.
అయితే రష్మీ తల్లిదండ్రులు మాత్రం విడిపోయారు. రష్మీ చిన్నతనం నుంచి కూడా తన అమ్మే పెంచి పోషించి పెద్ద చేసింది. తండ్రి ప్రేమ అంటే ఏంటో తనకు తెలీదని రష్మీ స్టేజ్ మీదే ఎన్నో సార్లు కంటతడి పెట్టుకుంది. అలాంటి రష్మీ ఇప్పుడు బ్రేకప్ బాధను అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. రష్మీ పర్ఫామెన్స్ చేసిన తీరు చూస్తుంటే.. నిజంగానే తనకు బ్రేకప్ జరిగిందా? అనే అనుమానం కలిగించేస్తోంది. తాను ఏది చేసినా కూడా జనాలను ఎంటర్టైన్ చేసేందుకేనని, ఇది వరకు ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చింది. తెరపై చూపించేది నిజం కాదని చెప్పుకొచ్చింది. సుధీర్ను పెళ్లి చేసుకో అని అభిమానులు పదే పదే అడుగుతుండటంతో రష్మీ ఇలా చెప్పింది.
Anchor Rashmi Gautam Emeotional Dance Performance in Mana OOri devudu Event
తామిద్దిరం కేవలం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని, స్క్రీన్ మీద కేవలం ఆడియెన్స్ను ఎంటర్టైన్ చేసేందుకే అలా నటిస్తామని తెలిపింది. అయితే రష్మీకి లవ్ స్టోరీ ఉందని, బ్రేకప్ జరిగిందనేది రూమరా? నిజమా? అన్నది తెలియడం లేదు. కానీ తాజాగా ఆమె డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసి అందరూ ఒకే డైలాగ్ చెబుతున్నారు. బాధలోంచి వచ్చే ఎమోషన్, డ్యాన్స్ మాత్రం నెక్ట్స్ లెవెల్లో ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. ఇదే మాటలను ఈవెంట్లో కూడా అనేశారు. నిజంగా రష్మీ అంత బాధను అనుభవించిందా? అందుకే అంతలా డ్యాన్స్ చేసిందా? అని జనాలు అనుకుంటున్నారు. అటు నువ్వే ఇటు నువ్వే అనే పాటకు రష్మీ చేసిన పర్ఫామెన్స్ అందరినీ కదిలించేలా ఉంది.
New Villain : ఈ మధ్య సినీ పరిశ్రమకి కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు. కుబేర లో నటించిన విలన్…
Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…
Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…
8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…
Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…
Daughter : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…
Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…
This website uses cookies.