Venu Swamy : 2030 తర్వాత తారక్ రాజకీయ అరంగేట్రం... వేణు స్వామి...!
Venu Swamy : జ్యోతిష్య పండితులు వేణు స్వామి… రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరంటే తెలియని వారు ఉండరు కాబోలు. నిత్యం సినీ సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకుల జాతకాలను బయటపెడుతూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురవుతూ ఉంటారు. అయినా సరే వేణు స్వామి మాత్రం ఎవరు ఎన్ని రకాలుగా ట్రోలింగ్ చేసినా సరే తన పని తాను చేసుకుని వెళ్తానంటూ చాలా సందర్భాలలో తెలియజేశారు. ఇప్పటికే పలు రాజకీయ నాయకులు మరియు సినీ సెలబ్రిటీల జాతకాలను బయటపెట్టిన వేణు స్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా వేణు స్వామి మాట్లాడుతూ….జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో తిరుమల క్షేత్రంలోజూనియర్ ఎన్టీఆర్ తల్లితో తాను ఈ విషయంపై మాట్లాడినట్లుగా తెలియజేశారు. అదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న దోషం గురించి కూడా తన తల్లికి తెలియజేసినట్లుగా వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఇక ఆ మాట చెప్పిన వెంటనే ఈ విషయం తనకి, సీనియర్ ఎన్టీఆర్ కి ,జూనియర్ ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ తెలియదని మీకు ఎలా తెలిసింది అంటూ ఆమె ఆశ్చర్యపోయారని తెలిపారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ని 2030 తర్వాత రాజకీయాల్లోకి తీసుకు రమ్మని అప్పటివరకు తీసుకురావద్దని వేణు స్వామి తెలిపినట్లుగా తెలియజేశారు.
Venu Swamy : 2030 తర్వాత తారక్ రాజకీయ అరంగేట్రం… వేణు స్వామి…!
ప్రస్తుతం ఆయన సినీ ఇండస్ట్రీలోనే ఉండడం మంచిదని ,రాజకీయాల్లోకి రావడానికి ఇంకా చాలా సమయం ఉందంటూ ఈ సందర్భంగా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. వేణు స్వామి మాటలు విన్న తారక్ అభిమానులు అదే నిజమైతే బాగంటూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఆయన్ని సినీ నటుడుగా సినీ ఇండస్ట్రీకే పరిమితం చేయడం మంచిదంటూ నీచమైన రాజకీయాల్లోకి తారక్ ను తీసుకురావద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
This website uses cookies.