sreemukhi : ఈటీవీ ప్లస్ లో కొత్తగా జాతిరత్నాలు అనే కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి యాంకర్గా శ్రీముఖి వ్యవహరిస్తోంది. భారీ ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో శ్రీముఖి ఇస్తున్న పారితోషికం ఎంత అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ లో అనసూయ మరియు రష్మి గౌతమ్ ల స్థాయి లోనే శ్రీముఖి పారితోషికం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం అంత సీన్ లేదని క్లారిటీ వచ్చింది.
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం శ్రీముఖి ఒక్కొక్క షెడ్యూల్ కి ఆరు లక్షల నుండి ఏడు లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క షెడ్యూల్లో ఒక వారం కు సంబంధించిన పూర్తి ఎపిసోడ్స్ ను చిత్రీకరణ చేస్తారు. తద్వారా ఒక వారానికి వచ్చి శ్రీముఖి కి వారం కు ఆరు నుండి ఏడు లక్షల పారితోషికం అందుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒకప్పుడు శ్రీముఖి ఇంతకు మించి పారితోషికం దక్కించుకునేది. కానీ ఈ మధ్య కాలంలో ఆమె స్థాయి తగ్గినట్లుగా అనిపిస్తుంది. అందుకే ఆమె పారితోషికం కూడా తగ్గినట్లు సమాచారం అందుతోంది. మల్లెమాల వారితో కనెక్షన్ ఉండాలని వాళ్లతో కలిసి వర్క్ చేయాలనే కోరికతో శ్రీముఖి చాలా కాలంగా ఉంది.
అందుకే ఈ కార్యక్రమానికి ఆమె నో చెప్పకుండా తక్కువ పారితోషికం అయినా కూడా ఈ కార్యక్రమాన్ని ఆమె చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మల్లెమాల వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈటీవీ ప్లస్ లో టెలికాస్ట్ అవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.ఫలితం ఎలా ఉన్నా కూడా కొన్నాళ్లపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అవకాశాలున్నాయి. గతంలో రెచ్చిపోదాం బ్రదర్ అనే కార్యక్రమం కొన్నాళ్ళు టెలికాస్ట్ అయ్యి ఆగి పోయింది. ఇప్పుడు అదే తరహాలోనే జాతిరత్నాలు కార్యక్రమం కూడా ఆగిపోయే అవకాశం ఉందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం కార్యక్రమం చాలా కాలం పాటు నడుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…
This website uses cookies.