Allu Arjun : డై హార్డ్ ఫ్యాన్స్ని బన్నీ దారుణంగా కొడతాడు, తంతాడు.. సంచలన కామెంట్స్ చేసిన గబ్బర్ సింగ్ నటుడు
Allu Arjun : గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్పై మెగా అభిమానులు తీవ్రమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. నంద్యాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడాన్ని మెగా ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. అదే సమయంలో నాగ బాబు ట్వీట్ చేయడం.. ఆ తర్వాత ట్విట్టర్ ను డీయాక్టివేట్ చేసి యాక్టివేట్ చేయడం.. పవన్ గెలిచాక మెగా సెలబ్రేషన్స్ కు కూడా రాకపోవడం.. ఇవన్నీ తెలిసిందే. మెగా ఫ్యామిలీలో అందరూ బాగానే ఉన్నారని చెప్పుకోవడానికి లేదు.
పవన్ గెలిచిన తర్వాత మెగా కాంపౌండ్లో బన్నీ కానీ , అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కానీ కనిపించలేదు. నాగబాబు, సాయిథరమ్ తేజ్లు అల్లు అర్జున్పై తమ ఆగ్రహాన్ని నేరుగా చూపించారు. అయితే పెద్దలు కల్పించుకుని గొడవను చక్కదిద్దినట్లుగా ఫిలింనగర్లో ఊహాగానాలు వినిపించాయి. బన్నీ లేటెస్ట్ మూవీ పుష్ప – 2 వాయిదా పడటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇటీవల మెగా, అల్లు కుటుంబాలకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీ వాసు సైతం ఈ విభేదాలను ధృవీకరించేలా మొన్నామధ్య ప్రెస్మీట్లో మాట్లాడటాన్ని తేలికగా తీసుకోవడానికి లేదు. ఈ వరుస సంఘటనలతో అల్లు అర్జున్ టార్గెట్ అవుతున్నారు.
Allu Arjun : డై హార్డ్ ఫ్యాన్స్ని బన్నీ దారుణంగా కొడతాడు, తంతాడు.. సంచలన కామెంట్స్ చేసిన గబ్బర్ సింగ్ నటుడు
తాజాగా పవర్స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్బస్టర్ మూవీ గబ్బర్ సింగ్లో అంత్యక్షరి గ్యాంగ్లో ఒకడైన సాయిబాబా అనే నటుడైతే ఏకంగా అల్లు అర్జున్ సినిమాలో అవకాశం వచ్చినా చేయనని కరాఖండీగా తేల్చిచెప్పేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బన్నీ బిహేవియర్ తనకు నచ్చదని, సెల్ఫీ, ఆటోగ్రాఫ్ కోసం వచ్చే అభిమానులను ఆయన తన్నడాన్ని చూశానని సాయిబాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తనను తిట్టినా పర్లేదని.. పుష్ప-2 డేట్ ఇంకా ఛేంజ్ చేసుకుంటూ ఉండాల్సిందేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసునని.. కొంతమంది ఇండస్ట్రీ నుంచే వెళ్లిపోయారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సాయిబాబాపై బన్నీ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.
Chandrababu : ఏపీ కేబినెట్ AP Cabinet ఈరోజు (గురువారం) CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది.…
YS Jagan : రాజంపేట మున్సిపాలిటీ, రామకుప్పం మండలం, మడకశిర మున్సిపాలిటీ, రొద్దం మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో…
Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా భిన్నంగా వ్యవహరిస్తుంది. హింసను వదులుకోవడానికి…
Pakistan Youth : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్లో 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నందుకు భారత సైన్యం…
Samantha : నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అనే ప్రచారాలు జోరుగా…
Pakistan : పాక్కు భారత్ చుక్కలు చూపిస్తుంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక…
అమెజాన్, ఫ్లిప్ కార్ట్లలో ఒక్కోసారి బంపర్ ఆఫర్స్ పెడుతుంటారు. వాటి వలన కాస్ట్లీ ఫోన్స్ కూడా సరసమైన ధరలకి లభిస్తుంటాయి…
Summer : వేసవికాలం భరించలేనిది. మండే ఉష్ణోగ్రతలు డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, వడదెబ్బ ప్రమాదాన్ని పెంచుతాయి. మనమందరం ఎండ రోజులను…
This website uses cookies.