Guppedantha Manasu 17 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 ఆగస్టు 2022, బుధవారం ఎపిసోడ్ 531 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటి జగతి.. నిశ్చితార్థం ఆగిపోయిందని స్వీట్లు చేయమంటున్నావా? ఏంటి ధరణి.. అందరి కళ్లు చల్లబడ్డాయా అని అంటుంది దేవయాని. దీంతో గౌతమ్ స్వీట్లు కావాలని అడిగాడు అంటుంది జగతి. ఇలాంటప్పుడే ఎవరి బుద్ధి ఏంటో బయట పడుతుంది అంటుంది దేవయాని. కరెక్టే.. మీ బుద్ధి గురించి మాట్లాడేంత బుద్ధి నాకు లేదు అంటుంది జగతి. ఇంతలో దేవయాని దగ్గరికి వచ్చిన గౌతమ్ పెద్దమ్మ.. సాక్షి వచ్చి మిమ్మల్ని బెదిరించింది. రిషిని పెళ్లి చేసుకోకపోతే కోర్టుకు ఎక్కుతానంది. రిషి ఇందులో చేసిందేముంది. ఆ సాక్షి పెళ్లి వద్దని అన్నది కదా అంటాడు గౌతమ్. ఇంతలో అక్కడికి రిషి వచ్చి.. ఏంట్రా పెద్దమ్మను ఏమంటున్నావు. నేను ఉండగా పెద్దమ్మను ఏం అనడానికి లేదు అంటాడు రిషి.
రిషి.. నువ్వేంటో నాకు తెలుసు.. నేనేంటో నీకు తెలుసు కదా అంటుంది దేవయాని. పెద్దమ్మ నువ్వేం బాధపడటం లేదు కదా అంటాడు రిషి. దీంతో పెద్దమ్మకు ఏం బాధలేదురా అంటాడు గౌతమ్. తను సెలబ్రేట్ చేసుకుందాం అంటోంది అంటాడు గౌతమ్. మరోవైపు వీళ్ల సంగతికేం కానీ.. నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని. మరోవైపు రిషి చేయించిన ఉంగరాన్ని తీసుకొని ఆటోలో వెళ్తుంటుంది వసుధర. తనను చూసి ఫోన్ చేసి ఆటో దిగు అంటాడు. మీరు ఎక్కడున్నారు అన్నా కూడా వినడు. ముందు నువ్వు ఆటో దిగు అంటాడు రిషి. దీంతో ఆటో దిగుతుంది. ఇంతలో కారులో వస్తాడు రిషి. కూర్చో అంటాడు. దీంతో తను కారులో కూర్చొంటుంది.
మరోవైపు మహీంద్రా, జగతి, ధరణి ముగ్గురూ చాలా సంతోషంగా ఉంటారు. ఎక్కడ రిషి, సాక్షి పెళ్లి జరుగుతుందో అని తెగ టెన్షన్ పడ్డా అంటాడు మహీంద్రా. కానీ.. సాక్షి గారు నాకు పెళ్లి వద్దు అని చెప్పి వెళ్లిపోయారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు మహీంద్రా.
మరోవైపు రిషి నా గుప్పిట్లో నుంచి జారిపోయాడు అని అనుకుంటుంది దేవయాని. ఇప్పుడు వసుధరకు లైన్ క్లియర్ అయిపోయింది. సాక్షి ఇలా చేసిందేంటి అని అనుకుంటుంది. కోపం వస్తుంది తనకు. తను రూమ్ లో అన్ని సామాన్లు విసిరేస్తుంది.
నేనేది కావాలని చేయలేదు అని వసుధరతో అంటాడు రిషి. మీరు నాకు సంజాయిషీ ఇవ్వడం ఏంటి అంటుంది వసుధర. ఒక్కోసారి సంజాయిషీ ఇవ్వాల్సి వస్తుంది. నా జీవితంలో తుఫాను వెలిసినట్టు ఉంది. సాక్షి నాకు దూరం అయిందని నాకు ఇప్పుడు ఏం బాదలేదు అంటాడు రిషి.
రిషి, వసుధర ఇద్దరూ కలిసి హోటల్ కు రావడం చూస్తారు మహీంద్రా, జగతి, గౌతమ్. వాళ్లు కూడా అదే హోటల్ కు వస్తారు. జగతి ఏంటి ఇది అంటాడు మహీంద్రా. మనం ఇంకో కేక్ కట్ చేయాలి అంటాడు. వసుధర, రిషి ఇద్దరూ కలిసి రావడం చూసి షాక్ అవుతారు.
మరోవైపు వదిన కాఫీ ఇవ్వు అంటాడు రిషి. దీంతో కాఫీ నేను ఇవ్వనా సార్ అంటుంది జగతి. దీంతో మేడమ్ మీరు ఇప్పటి నుంచి నన్ను సార్ అని పిలవకండి. రిషి అని పిలిస్తే చాలు అంటాడు రిషి. దీంతో జగతి సంతోషిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
This website uses cookies.