Home » Entertainment » Hyper Aadi Eats Green Chilli In Sridevi Drama Company
Entertainment

Hyper Aadi : నాకు తండ్రి లేడు, నేను ఎవడి కొడుకుని కాదు.. మండిపోయిన హైపర్ ఆది అలా అనేశాడేంటి?

Authored By
aruna
The Telugu News | Published on: August 4, 2022, 5:40 pm
Advertisement

Hyper Aadi : హైపర్ ఆది బుల్లితెరపై ఎలాంటి స్టార్డంను ఎంజాయ్ చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. అయితే ఆదికి తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పడింది. సుధీర్ వెళ్లడంతో మరింత ఎక్కువగా ఆది ప్రాబల్యం పెరిగింది. శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ వంటి షోల్లో ఆది డిమాండే ఎక్కువగా ఉంది. ఆది చెప్పిందే జరుగుతున్నట్టుంది. మొత్తానికి హైపర్ ఆది మాత్రం ఇప్పుడు అక్కడ కింగులా ఏలేస్తున్నాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షో అయితే అంతా తానై ముందుకు నడిపిస్తున్నాడు. రాం ప్రసాద్, ఆదిల ర్యాపో కూడా బాగానే కలిసివస్తోంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోకు ఓ ప్రెష్ నెస్ వచ్చింది. కమెడియన్, సీనియర్ ఆర్టిస్ట్ కృష్ణ భగవాన్ వచ్చాడు.

Advertisement

ఆయన గెస్టుగా ఈ ఎపిసోడ్‌ను చేశారు. దీంట్లో కృష్ణ భగవాన్ అందరినీ ఆడేసుకున్నట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆది, వర్ష ఇలాంటి వారందిరి మీదా పంచులు వేశాడు. ఇక ఈ సారి థీమ్ ఏంటంటే.. చిన్న తనంలో నా కొడుకు, కూతురు తప్పి పోయారు.. వాళ్లు తిరిగి వస్తే నా ఆస్తి అంతా ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ చెబుతాడు కృష్ణ భగవాన్. ఇక ఇందులో అందరూ పోటీ పడతారు. నేనంటే నేను అని పోటీ పడుతూ వస్తారు. ఎవరు తన కొడుకు, కూతురు అనే తేల్చేందుకు రకరకాల పోటిలు పెట్టించినట్టు కనిపిస్తోంది. ఇక ఇందులో ఒక్కొక్కరికీ మండిపోయేలాంటి పరీక్షలు పెట్టించేశారు. అందరూ పచ్చి మిర్చీ తినాలనే టాస్క్ ఇచ్చారు.

Hyper Aadi Eats Green Chilli in Sridevi Drama Company

Advertisement

దీంతో ఆడవాళ్లంతా కూడా రెడీ అయ్యారు. ఒక వేళ చివరకు ఫైమా మిగిలితే.. మాత్రం దాన్ని చంపేసి నేను కూడా చచ్చిపోతాను అని కృష్ణ భగవాన్ అన్నాడంటూ ఆది చెప్పుకొచ్చాడు. ఇక మగవాళ్లంతా కూడా పరీక్షకు సిద్దమయ్యాడు. ఒక్క మిర్చి తినేలోపు ఆదికి ఎక్కడో మండిపోయినట్టుంది. నాకు తండ్రి లేడు.. నేను ఎవడి కొడుకుని కాదు అని అంటాడు. వందల కోట్ల ఆస్తి అని రష్మీ రెచ్చగొడుతుంది.. అసలు నేను నా కొడుకు అనే ఈవెంట్లోనే లేను అంటూ లేచివెళ్లిపోయేందుకు సిద్దమవుతాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి