Intinti Gruhalakshmi 12 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 12 అక్టోబర్ 2023, గురువారం ఎపిసోడ్ 1073 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయమే నందుకు ఫోన్ వస్తుంది. గుడ్ మార్నింగ్ అంటూ రత్న ప్రభ ఫోన్ చేస్తుంది. రోమ్ నగరం తగులబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడట. నీది అలాగే ఉంది. హనీని తిరిగి పంపించకపోతే కొంపలంటుకుంటాయి అని చెప్పినా నువ్వు వినలేదు. ప్రశాంతంగా గురక పెట్టి నిద్రపోతున్నావా? అసలు నీకు ఎలా నిద్ర పడుతోంది. కొంచెం కూడా భయం అనిపించడం లేదా? అంటే కొద్దిగా టైమ్ కావాలి అని అడిగా కదా అంటాడు నందు. దీంతో గంటల తరబడి వెయిట్ చేస్తానని ఎలా అనుకున్నావు అంటుంది రత్నప్రభ. తులసి నీ మాట వినకపోతే ఏం చేస్తావు. బలవంతంగా హనీని తులసి నుంచి వేరు చేసి నాకు అప్పజెప్తావా? నిజంగా నీకు అంత దమ్ము ఉంటే ఇప్పుడెందుకు చేయకూడదు. జీవితకాలం సమయం ఇచ్చినా ఏ విషయంలోనూ తులసిని నువ్వు కన్విన్స్ చేయలేవు. అంత టాలెంట్ ఉంటే.. లాస్యకు విడాకులు ఇవ్వగానే తులసి మెడలో తాళి కట్టేవాడివి అంటుంది రత్నప్రభ.
నావి ఉత్తుత్తి బెదిరింపులు కావు. ఇప్పటికే యాక్షన్ లోకి దిగిపోయాను. మీ అమ్మను, హనీని తీసుకొని తులసి గుడికి వెళ్లింది. ఇంకొన్ని నిమిషాల్లో వాళ్ల ఆయుష్షు ముగియబోతోంది. వెళ్లు.. పరిగెత్తి మీ వాళ్లను కాపాడుకోపో అంటూ సీరియస్ అవుతుంది రత్నప్రభు. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. ఈ భయమే నందులో నేను చూడాలని అనుకున్నది అని అంటుంది లాస్య. వెంటనే నందు బయటికి వచ్చి నాన్న.. తులసి వాళ్లు ఎక్కడ అని అడుగుతాడు. దీంతో గుడికి వెళ్లారు అని అంటాడు. ఏ గుడికి అంటే నాకు తెలియదు అంటాడు పరందామయ్య. నేను అర్జెంట్ గా తులసితో మాట్లాడాలి అంటాడు నందు. వెంటనే తులసికి ఫోన్ చేస్తాడు. కానీ.. తను ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏమైందిరా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటే నాన్న తులసి వాళ్లు ప్రమాదంలో ఉన్నారు. ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను అని చెప్పి వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలి అని బయటికి వెళ్తాడు. పరందామయ్య ఫోన్ చేసినా కూడా తులసి ఫోన్ లిఫ్ట్ చేయదు.
ఇంతలో మళ్లీ రత్నప్రభ ఫోన్ చేస్తుంది. వాళ్లు ఎక్కడున్నా కూడా నేను వెతికి పట్టుకుంటాను అంటాడు నందు. తులసి వాళ్లు ఏ గుడికి వెళ్లారో చెప్పు అంటే రత్నప్రభ చెప్పదు. అవసరం నీది బెదిరించకు.. బతిమిలాడుకో అంటుంది రత్నప్రభ. శ్రీనివాస నగర్ అమ్మ వారి గుడికి వెళ్లారు. వెళ్లి కాపాడుకోపో అంటుంది రత్నప్రభ. నువ్వు ఇలా నందును ఏడిపిస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తోంది అంటుంది లాస్య.
మరోవైపు అనసూయ, హనీ, తులసి.. ముగ్గురు గుడికి వెళ్తారు. గుడిలో దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. మరోవైపు నందు ఆ గుడికి కారులో బయలుదేరుతాడు. ఇంతలో మళ్లీ రత్నప్రభ కాల్ చేస్తుంది. హడావుడిలో పడిపోయి ఇందాక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. తులిసి వాళ్లు వెళ్లింది అమ్మ వారి గుడికి కాదు.. రామాపురంలోని రాముల వారి గుడికి. వెంటనే వెళ్లి మీ వాళ్లను కాపాడుకో అంటుంది రత్నప్రభ.
దీంతో రాముల వారి గుడికి వెళ్తాడు నందు. అక్కడికి వెళ్లాక ఆ టెంపుల్ కాదు వేరే టెంపుల్ అంటూ అన్ని గుడులకు తిప్పుతుంది రత్నప్రభ. ఇలాగే.. ఏ గుడినో సరిగ్గా చెప్పదు. గాంధీనగర్ లోని శివాలయానికి వెళ్లు. ఇంకా 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఇదే నా లాస్ట్ కాల్ అంటుంది రత్న ప్రభ. మరోవైపు రౌడీలు తులసి చుట్టుముడతారు. అప్పుడే నందు కారులో దిగి వాళ్లను కాపాడుతాడు.
మీరేంటి ఇక్కడ అంటే.. అసలు బుద్ధి ఉందా? ఎక్కడికి వెళ్తున్నారో ఏ గుడికి వెళ్తున్నారో చెప్పరా? అంటూ తులసి మీద సీరియస్ అవుతాడు నందు. సారీ అండి. గుడికి వస్తున్నాను కదా అని మొబైల్ ను సైలెంట్ మోడ్ లో పెట్టుకున్నాను తెలియలేదు అంటుంది. అయినా మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అంటే నా టెన్షన్ నాకు ఉంటుంది. నా భయం నాకు ఉంటుంది అంటాడు నందు. ఆ తర్వాత అందరినీ కారులో తీసుకెళ్తాడు నందు.
మరోవైపు దివ్యపై నిందలు వేస్తారు. అసలు నువ్వు ఎందుకు వెళ్లావు అంటే.. మా తాతయ్యను ఎవరో కొడితే చూడటానికి వెళ్లాను అంటుంది దివ్య. మీరు ఎందుకు జానును హద్దుల్లో పెట్టుకోవడం లేదు అంటే.. వీళ్లిద్దరూ బావమరదళ్లు.. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసే పెరిగారు అని అంటారు. నేను కావాలని చేయలేదు. తాగిన మత్తులో ఉన్నాను. ఏం చేశానో గుర్తు రావడం లేదు అంటాడు విక్రమ్.
విక్రమ్ తాగిన మత్తులో ఉంటే.. పెళ్లి కాని ఆడదానివి. నువ్వు నీ జాగ్రత్తలో ఉండొచ్చు కదా. అసలు విక్రమ్ కి మందు అలవాటు లేదు. నీతో మందు తాగించింది ఎవరు అంటే.. ఏదో సరదాగా కొద్దిగా తాగుతాడులే అనుకున్నాను. అయినా మందు తాగడంలో తప్పేం ఉంది. ఇది కల్చరే కదా అంటుంది జాను. దీంతో విన్నారు కదా.. జాను ఎలా మాట్లాడుతుందో అంటుంది దివ్య.
జరిగిన తప్పును సరిచేస్తాను.. అంటుంది రాజ్యలక్ష్మీ. ప్రసునాంబ పసుపు తాడు తీసుకురా అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో నేను ఒప్పుకోను అంటుంది దివ్య. నా రెండో కొడుకు ప్రియ విషయంలో తప్పు చేశాడు. ఆ తప్పు ఒప్పుకొని ముహూర్తం చేసి పెళ్లి చేస్తామంటే వెంటనే తాళి కట్టించావు. ఇప్పుడు విక్రమ్ విషయంలోనూ అదే జరుగుతోంది. జానును విక్రమ్ రెండో భార్యగా చేయడం జానుకు అన్యాయం చేసినట్టు అవుతుంది. కానీ.. అది తప్పడం లేదు. ప్రసునాంబ పసుపు తాడు తీసుకురా. నా బిడ్డ తాగినమత్తులో చేసిన తప్పుకు ఇదే శిక్ష అంటుంది రాజ్యలక్ష్మీ.
దీంతో సరే ఒప్పుకుంటున్నాను అంటుంది దివ్య. నా భర్త చేసిన తప్పుకు శిక్ష నేను అనుభవిస్తాను. కాకపోతే శిక్ష పడాలి అంటే నేరం రుజువు కావాలి కదా అంటుంది దివ్య. మరోవైపు హనీని రూమ్ లోకి పంపించి.. మన ఫ్యామిలీని చంపుతాం అని బెదిరిస్తున్నారు అంటూ తులసికి చెబుతాడు నందు. హనీని పంపించేస్తే సమస్యలు తీరుతాయి అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.