#image_title
Jagananna Gruha Nirmana Yagnam Scheme : ఏపీలో సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు. నవరత్నాలు మాత్రమే కాదు.. పేదల కోసం చాలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. తాజాగా జగనన్న గృహ నిర్మాణ యజ్ఞం అనే స్కీమ్ ను సీఎం జగన్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ కింద 30.75 లక్షల ఉచిత ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు. అలాగే.. 21.76 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసి పేద అక్కాచెల్లెమ్మలకు అందజేయనున్నారు. వివిధ దశల్లో శరవేగంగా మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇవాళ సామర్లకోటలో అక్కాచెల్లెమ్మలను లాంఛనంగా సీఎం వైఎస్ జగన్ ఇళ్లను అందించనున్నారు.
పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా.. ఎందరికో ఇళ్లు లేని పేదలకు సొంతింటి కలను నిజం చేశారు సీఎం జగన్. సీఎం జగన్ ఇల్లు లేని వాళ్లకు స్థలం ఇస్తున్నారు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులను ప్రభుత్వమే ఇస్తోంది. తద్వారా ఇల్లు లేని పేదలు ఎందరికో సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చుతున్నారు. రాష్ట్రవ్యాపత్గా గూడు లేని లక్షల మంది పేదలు సొంతింటి యజమానులు అవుతున్నారు. పేదల ఆవాసాల కోసం దాదాపు రూ.1.06 లక్షల కోట్లను వ్యయం చేస్తూ అక్కచెల్లెమ్మల చేతికి విలువైన స్థిరాస్తిని కానుకగా అందజేస్తోంది. 30.25 లక్షల మంది పేదలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.56,102.91 కోట్లు వెచ్చించింది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు ఖర్చు చేస్తుండటంతో ఏకంగా కొత్త పట్టణాలే తయారవుతున్నాయి.
#image_title
ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర వాటా కింద చెల్లింపులతో పాటు ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లను ప్రభుత్వమే భరిస్తోంది. సకల సదుపాయాలతో నిర్మిస్తున్న ఇంటి విలువ కనీసం రూ.10 లక్షల వరకు టుంది. కొన్ని ప్రాంతాల్లో ఖరీదైన స్థలాలు కూడా ఇస్తున్నారు. పేదల గృహ నిర్మాణాల ద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపద సృష్టిస్తోంది.
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్తో మార్కెట్ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
This website uses cookies.