Intinti Gruhalakshmi 21 Oct Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ అన్నీ దాదాపుగా ఫ్యామిలీ ఆడియన్స్ను అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. అందులో భాగంగానే టెలికాస్ట్ అవుతూ విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్లో ఈ రోజు(గురువారం) టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో ఎవరెవరి మధ్య ఏం సంఘనలు జరుగబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. నిన్న టెలికాస్ట్ అయిన సీన్స్ అందరినీ ఆకట్టుకుని ఉత్కంఠను రేపాయి. మరి ఈ రోజు ఎలా ఉండబోతుందో..? అంకితతో మాట్లాడటానికి ప్రేమ వచ్చిన సందర్భంగా ఆమెతో గొడవపడతాడు. అతడు ఎలాంటి తప్పు చేయకపోయినా తన తల్లి కోసం అంకితకు సారీ చెప్పేస్తాడు.
ఆయన తల్లికి పెద్ద సమస్య వచ్చిందని ప్రేమ్ ఆలోచిస్తూ ఫీల్ అవుతుంటాడు. ఇదే విషయంపై తులసి, లాస్య మధ్య గొడవ తలెత్తుతుంది. పెళ్లి అంటే ఇష్టపడని నందు.. నా పరువు తీశావు అంటూ లాస్యపై సీరియస్ అవడంతో ఇక చివర్లో ఎంట్రీ ఇచ్చిన పరందామయ్య అందరిపై సీరియస్ అవతాడు. ఇక పరందామయ్య మాటలపై ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది. అదే టైంలో అనసూయ ఆమె కొడుకునే వెనకేసుకొచ్చేలా మాట్లాడటంతో పరందామయ్య కలుగజేసుకుని శృతి, ప్రేమ్ పెళ్లి చేయడంతో రెస్పాన్సిబులిటీ తీరిపోయిందా అంటూ తులసిని ప్రశ్నిస్తాడు. పంతులును పిలిపించి వారి ఫస్ట్ నైట్ కోసం ముహూర్తం పెట్టించాలని సూచిస్తాడు.
ప్రేమ్ వద్దకు శృతి కాఫీ తీసుకొస్తుంది. ఇ టైంలో వారిద్దరూ సరసాలాడుతుంటారు. అదే సమయంలో పూజారి వారి ఫస్ట్నైట్ కోసం ముహూర్తం చూస్తుండగా.. నందూ ఎంట్రీ ఇచ్చి ముహూర్తానికి ఇంతలా ఆలోచించాలా అంటూ అక్కడి నుంచి వెళ్తాడు. అతన్ని తులసి ఆపి మీరు ఇంటిపెద్ద కదా.. ఉండాలి అని చెబుతుంది. ఇంతలో లాస్య కలుగజేసుకుని నందూను అడిగాకే అన్ని చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తుంది.పోతున్నది. 2 కోట్లు ఇవ్వు.. ఇస్తానని అప్పుడు చెప్పావుగా వాటిని ఇవ్వు అని లాస్య అంటుంది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు గడువు ఇవ్వాలని తులసి ప్రాజెక్టు ఇచ్చిన వారిని కోరుతుంది.
నందుకు కాంట్రాక్ట్ ఇచ్చిన వారు అక్కడికి వచ్చి సీరియస్ అవుతారు. చూశావా తులసి.. నందు పరువు అందుకు తనదే బాధ్యత అని అవసరమైతే తన ఇల్లు తాకట్టు పెడతానంటూ చెబుతుంది. అదే టైంలో శిశకళ వచ్చి.. ఇల్లు నాకు తాకట్టు పెట్టావు కదా అని చెప్పడంతో అవసరమైతే ఇల్లు అమ్మేసైనా సరే అప్పుతీరుస్తానంటూ తులసి ఆన్సర్ ఇస్తుంది. నందు చేసిన అప్పును తాను తీరుస్తానని శశికలకు తులసి మాట ఇస్తుంది. దీంతో శశికళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం కంపెనీవారు సైతం తులసి చెప్పిన మాటతో ప్రాజెక్టును పూర్తిచేసేందుకు టైం ఇస్తున్నట్టు చెప్పి వారు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పటికే అందరూ ఆందోళనలో ఉండగా ఈ పరిస్థితికి శృతే కారణమంటూ అంకిత అంటుంది. దీంతో అందరూ మరోసారి షాక్కు గురవుతారు. అనంతరం అక్కడి నుంచి ఒకరి తర్వాత మరొకరు వెళ్లిపోతారు. దీంతో తులసి సైతం కాస్త ఫీల్ అవుతుంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.