
Puri jagannath : టాలీవుడ్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఓ రేంజ్ అండ్ ఇమేజ్ ఉంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తన సత్తా మరో దర్శకుడికి లేదనే చెప్పాలి. బద్రి సినిమాతో డైరెక్టర్ అయిన పూరి తన మొదటి సినిమాకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. మొదటివారం ఈ సినిమా ఫ్లాప్ అనే టాక్ వినిపించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఓ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ భారీ హిట్స్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఇండస్ట్రీలో పూరికి ముందు పరిచయమయిన హీరో మాస్ మహారాజ రవితేజ. ఇద్దరు కలిసి రాం గోపాల్ వర్మ దగ్గర అసోసియేట్స్ గా చేశారు. ఆ సమయంలో నీతో నేను సినిమా చేస్తానని పూరి చెప్పేవాడు.
is it such a worst movie made by puri jagannath…?
ఆ మాటలని రవితేజ లైట్ తీసుకునేవాడట. ఇతను డైరెక్టర్ ఎప్పుడవ్వాలి..నన్ను హీరోగా పెట్టి సినిమా ఎప్పుడు చేయాలి అని. మొదటి సినిమా పవన్ కళ్యాణ్ తో తీసి స్టార్ డైరెక్టర్ అయ్యాక అప్పుడు రవితేజ ఆలోచన మారింది. బద్రి తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాను పూరి, రవితేజతో చేశాడు. అయితే ఈ కథ చెప్పడానికి రవితేజకి కాల్ చేసిన పూరితో నువ్వు కళ్యాణ్ తో సినిమా చేశాక నాతో చేయవనుకున్నాను..అని అన్నాడట. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఒక తమిళ అమ్మాయి
సినిమాలు వరుసగా వచ్చి హ్యాట్రిక్ హిట్ సాధించాయి. ఇలా మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చి హిట్ అవడం పెద్ద సంచలనం అయింది.
దాంతో పూరి జగన్నాథ్ – రవితేజ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో మళ్ళీ రవితేజతో ఇడియట్ 2 చేయాలనుకున్నాడు. కానీ కథ కుదరకపోవడంతో దాని బదులు దేవుడు చేసిన మనుషులు సినిమా చేశాడు. పూరి జగన్నాథ్ కెరీర్ లో బద్రి, పోకిరి, బిజినెస్ మేన్, కెమరా మాన్ గంగతో రాంబాబు, శివమణి, దేశ ముదురు, టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అయితే రవితేజకి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన పూరి, దేవుడు చేసిన మనుషులు సినిమాకి అనుకున్న కథను సరిగ్గా చెప్పలేకపోయానని.. తన లైఫ్ లో తీసిన చెత్త సినిమా
ఇదేనని పూరీ జగన్నాథ్ ఒక సందర్భంలో చెప్పారు. అలాగే పూరి – రవితేజ కాంబినేషన్ లో వచ్చిన నేనింతే కథ అద్భుతంగా ఉన్నా సినిమా ఇండస్ట్రీలోని లోపాలను సరిగా చూపించడానికి పూరి వెనక్కి తగ్గడంతో అనుకున్న హిట్ దక్కలేదు.
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్లో క్రికెట్కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
29 Movie Review : ఓటీటీ వేదికల్లో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాల్లో ‘29’ ఒకటి. తమిళంలో విడుదలైన…
Telangana Womens : తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…
Pension : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరితే వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురాగలవు. ముఖ్యంగా…
Vizag Steel Plant Blast : విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.…
Indian Railways Jobs 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరో…
This website uses cookies.