Janaki Kalaganaledu 27 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 సెప్టెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 397 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జెస్సీకి ఉండ్రాల్ల తద్ది గురించి వివరిస్తుంది జానకి. అలాగే ఆంటీ కాదు.. అత్తయ్య గారు అని పిలువు అని జెస్సీకి చెబుతుంది. కోడలుగా ఎలా ఉండాలి.. ఎలా ప్రవర్తించాలి.. వ్రతంలో ఎలా ఉండాలి. అందరి చూపు నీ వైపు ఉంటుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా అక్కడ వ్యవహరించాలి. లేకపోతే అత్తయ్య గారికి సమస్య వస్తుంది అంటుంది జానకి. దీంతో సరే అక్క అంటుంది. ఇవన్నీ విన్న మల్లిక ఎలాగైనా రేపు జెస్సీని అత్తయ్య తిట్టేలా చేయాలని అనుకుంటుంది మల్లిక. కట్ చేస్తే తెల్లవారుతుంది. వ్రతం కోసం పిండి పదార్ధాలు తయారు చేస్తూ ఉంటుంది జానకి. ఇంతలో అక్కడికి వచ్చిన జెస్సీ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దీంతో వ్రతం కోసం తయారు చేస్తున్నా అంటుంది. నేను చేస్తా అంటే సరే.. దీన్ని మిక్స్ చేస్తూ ఉండు అని చెప్పి జానకి అక్కడి నుంచి వెళ్తుంది.
జెస్సీ ఉండ్రాళ్లు తయారు చేస్తుండగా అక్కడికి వచ్చిన మల్లిక ఏం చేస్తున్నావు జెస్సీ అని అడుగుతుంది. దీంతో ఉండ్రాళ్లు చేస్తున్నా అక్క అంటుంది. ఉండ్రాళ్ల పిండిలో ఉప్పు కలుపుదామని అనుకుంటుంది. ఇంతలో ఉప్పు డబ్బాను అక్కడ నుంచి పక్కన పెట్టబోతుంది జానకి. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి రాబోతుండగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది మల్లిక. ఇంతలో పిండి బదులు ఉప్పు వేయబోతుంది జెస్సీ. దీంతో జ్ఞానాంబ చూసి జానకిని పిలుస్తుంది. అది అమ్మవారికి వండే నైవేద్యం. నేను చూశాను కాబట్టి సరిపోయంది అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జెస్సీ కోసం ఒక చీర తీసుకొచ్చి ఇది కట్టుకో అంటుంది జానకి.
మరోవైపు జెస్సీ, జానకిని ఎలా జ్ఞానాంబతో తిట్టించాలా అని అనుకుంటుంది మల్లిక. ఇంతలో జానకి, జెస్సీ ఇద్దరూ రెడీ అయి వస్తారు. జెస్సీని బాగా రెడీ చేసి తీసుకొస్తుంది జానకి. ఇంతలో ముత్తయిదువులు వస్తారు.
ఎవరీ అమ్మాయి పద్ధతికి చీర కట్టినట్టు లక్షణంగా ఉంది అని అడుగుతారు ముత్తయిదువులు. ఎప్పుడూ చూడలేనేలేదు. సాంప్రదాయానికి మనిషి రూపంలో నిలువెత్తులా ఉంది అంటారు. ఇంతలో మల్లిక వచ్చి ఎవరో చెప్పడానికి మా అత్తయ్య గారికి నోరు రావడం లేదు అంటుంది మల్లిక.
ఇంతలో మా అఖిల్ భార్య అని చెబుతుంది మల్లిక. ఒక మాట అయినా చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా మూడో కొడుకు పెళ్లి చేశారు ఏంటి అని అడుగుతారు. తన పేరు జెస్సీ అని చెప్పేసరికి అందరూ తమలో తాము మాట్లాడుకుంటారు.
మరోవైపు నీలావతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మల్లిక. ఇంతలో తను వస్తుంది. మనం జానకి బాధ్యతను తగలపెట్టాలి అంటుంది మల్లిక. లక్కను ముత్తయిదువులకు వాయినం ఇచ్చే జాకెట్ల దగ్గర పూస్తే వెంటనే అవి తగలబడిపోతాయి అంటుంది నీలావతి.
పూజ స్టార్ట్ అవుతుంది. జెస్సీ కూడా పూజలో కూర్చొంటుంది. పంతులు పూజ చేస్తాడు. ఆ లక్కను ముత్తయిదువులకు వాయినం ఇచ్చే జాకెట్లకు ఎవరూ చూడకుండా పూస్తుంది మల్లిక. ఆ తర్వాత వాటిని దీపం దగ్గర పెడతారు. పూజ జరుగుతుండగానే అవి అంటుకుంటాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
This website uses cookies.