janhvi kapoor
Janhvi kapoor: జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలు నిర్మిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. బోని సినిమాలు తెలుగు, తమిళం, హిందీ భాషలలోను రూపొందుతున్నాయి. అయితే ఆయన రీసెంట్గా వార్తలలోకి ఎక్కడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా సైబర్ నేరగాళ్ల బారిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ పడడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.బాలీవుడ్లో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న బోనీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి భర్త అనే విషయం తెలిసిందే. ఆయన్నుంచి తాజాగా సైబర్ కేటుగాళ్లు 3.82 లక్షలు స్వాహా చేశారు. దీనిని గుర్తించిన బోనీ కపూర్.. తన సహాయకుడి ద్వారా అంబోలీ పీఎస్ లో ఫిర్యాదు చేయించాడు.
IPC, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. 2022, ఫిబ్రవరి 09వ తేదీన ఆన్ లైన్ ద్వారా ఐదు లావాదేవీలను క్రెడిట్ ద్వారా ఉపయోగించడాని పోలీసులు గుర్తించారు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు కోసం మార్చి 30వ తేదీన ఫోన్ చేయడంతో మోసాన్ని బోనీ కపూర్ గుర్తించినట్లు ఫిర్యాదుదారుడు పోలీసులకు తెలిపాడు. డబ్బు విత్ డ్రా అయ్యిందని తెలుసుకున్న అనంతరం సంబంధిత బ్యాంకులో ఆరా తీయడం జరిగిందన్నాడు.క్రెడిట్ కార్డు వివరాలను ఎవరూ అడగలేదని, దీనికి సంబంధించి ఎలాంటి ఫోన్ రాలేదని అతను చెప్పాడు.
janhvi kapoor
ఐదు ట్రాన్సాక్షన్స్లతో మొత్తం రూ. 3.82 లక్షలను నిందితులు దోచుకున్నారు. అయితే ఈ లావాదేవీలు జరిపినప్పుడు బోనీ కపూర్కు తెలియదని.. తర్వాత అకౌంట్స్ చెక్ చేసినప్పుడు తాను డబ్బు పోగోట్టుకున్నట్లు గ్రహించారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి గురైన డబ్బు గురుగ్రామ్లోని ఓ కంపెనీ అకౌంట్లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు అంబోలీ పోలీస్ స్టేషన్లోని ఒక అధికారి పేర్కొన్నారు. బోనీ కపూర్ కు ఖుషీ కపూర్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, అన్షులా కపూర్ పిల్లలున్నారు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
This website uses cookies.