Mega Vs Nandamuri Fans : ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్.టి.ఆర్, చరణ్ తో తీసిన రాజమౌళి ఎక్కడ ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ చేసి చూపించలేదు. మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య ఉన్న రగడ గురించి ముందే ఒక ఆలోచన ఉన్న రాజమౌళి రెండు పాత్రలని చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నాడు. అంతే పవర్ ఫుల్ గా తెర మీద చూపించగలిగాడు. అయితే ఆ సినిమా వల్ల కాని గొడవలు మరో సినిమా వల్ల అవుతున్నాయి. మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాడు ఉప్పెన డైరక్టర్ బుచ్చి బాబు.
ఉప్పెనతో తొలి సినిమానే సెన్సేషనల్ హిట్ అందుకున్న ఇతగాడు తన సెకండ్ మూవీ తారక్ తో చేయాలని తెగ ఆరాటపడ్డాడు. అనుకున్నట్టుగానే ఎన్.టి.ఆర్ కి కథ చెప్పగా ఫస్ట్ హాఫ్ వరకు ఓకే సెకండ్ హాఫ్ నాట్ ఓకే అన్నాడు. ఎంత ట్రై చేసినా సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో బుచ్చి బాబు ప్రాజెక్ట్ వద్దనుకున్నాడు తారక్. ప్రస్తుతం చేస్తున్న కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ తో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. ఇక తారక్ కాదనడంతో చరణ్ ని పట్టుకున్నాడు బుచ్చి బాబు.
ఆ కథనే కొద్దిగా మార్చేసి చరణ్ కి చెప్పడట. చరణ్ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు. అయితే ఎన్.టి.ఆర్ కాదనుకున్న కథను చరణ్ చేయడంతో మళ్లీ ఫ్యాన్స్ మధ్య రగడ మొదలైంది. మా హీరో కథ మీ హీరో చేస్తున్నాడని అని వీళ్లు.. మీ హీరో చేయాలని లేదు అందుకే మా హీరోకి వచ్చిందని వాళ్లు ఇలా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఏది ఏమైనా మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య ఈ గొడవ హాట్ హాట్ గా మారింది. ఆర్.ఆర్.ఆర్ టైం లో కూడా ఈ ఫ్యాన్స్ మధ్య గొడవ జరగలేదు. మరి ఈ టైం లో ఈ ఫ్యాన్ వార్ పై ఆ ఇద్దరు హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.