Mega Vs Nandamuri Fans : మళ్ళీ కొట్లాడుతున్న మెగా నందమూరి ఫ్యాన్స్.. ఆర్ఆర్ఆర్ కాదు ఆ సినిమా పెట్టిన కిరికిరి.. గొడవ చల్లారాలంటే ఆ ఫలితం తేలాల్సిందే..!

Authored By Rame Samhith | The Telugu News | Updated on : 30 November 2022, 6:20 pm

Mega Vs Nandamuri Fans : ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్.టి.ఆర్, చరణ్ తో తీసిన రాజమౌళి ఎక్కడ ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ చేసి చూపించలేదు. మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య ఉన్న రగడ గురించి ముందే ఒక ఆలోచన ఉన్న రాజమౌళి రెండు పాత్రలని చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నాడు. అంతే పవర్ ఫుల్ గా తెర మీద చూపించగలిగాడు. అయితే ఆ సినిమా వల్ల కాని గొడవలు మరో సినిమా వల్ల అవుతున్నాయి. మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాడు ఉప్పెన డైరక్టర్ బుచ్చి బాబు.

ఉప్పెనతో తొలి సినిమానే సెన్సేషనల్ హిట్ అందుకున్న ఇతగాడు తన సెకండ్ మూవీ తారక్ తో చేయాలని తెగ ఆరాటపడ్డాడు. అనుకున్నట్టుగానే ఎన్.టి.ఆర్ కి కథ చెప్పగా ఫస్ట్ హాఫ్ వరకు ఓకే సెకండ్ హాఫ్ నాట్ ఓకే అన్నాడు. ఎంత ట్రై చేసినా సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో బుచ్చి బాబు ప్రాజెక్ట్ వద్దనుకున్నాడు తారక్. ప్రస్తుతం చేస్తున్న కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ తో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. ఇక తారక్ కాదనడంతో చరణ్ ని పట్టుకున్నాడు బుచ్చి బాబు.

Mega Vs Nandamuri Fans war latest

Mega Vs Nandamuri Fans war latest

ఆ కథనే కొద్దిగా మార్చేసి చరణ్ కి చెప్పడట. చరణ్ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడు. అయితే ఎన్.టి.ఆర్ కాదనుకున్న కథను చరణ్ చేయడంతో మళ్లీ ఫ్యాన్స్ మధ్య రగడ మొదలైంది. మా హీరో కథ మీ హీరో చేస్తున్నాడని అని వీళ్లు.. మీ హీరో చేయాలని లేదు అందుకే మా హీరోకి వచ్చిందని వాళ్లు ఇలా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఏది ఏమైనా మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య ఈ గొడవ హాట్ హాట్ గా మారింది. ఆర్.ఆర్.ఆర్ టైం లో కూడా ఈ ఫ్యాన్స్ మధ్య గొడవ జరగలేదు. మరి ఈ టైం లో ఈ ఫ్యాన్ వార్ పై ఆ ఇద్దరు హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp