Anchor Pradeep : తెలుగు పాపులర్ రియాలిటీ షోలలో ఒకటైన ఢీ డ్యాన్స్ షో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది డాన్స్ షో అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ విషయంలో ఏమాత్రం డోకా ఉండదు. అంతలా ఈ షో అందరిని ఆకట్టుకుంటూ వస్తోంది. అయితే ఢీ షో పేరు వినగానే.. డాన్స్ కంటే ముందు యాంకర్ సుధీర్ – రష్మీల జంటనే గుర్తొస్తుంది. సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీలే ఈ షోకి మెయిన్ ఎస్సెట్ అని చెప్పుకోవటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అధిక శాతం ప్రేక్షకులు..డా ఈ షోలో డాన్స్ చూడటం కంటే సుధీర్ – రష్మీల కెమిస్ట్రీ, కామెడీ చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
ఇప్పటికి 13 సీజన్లు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు పద్నాలుగో సీజన్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ కొత్త సీజన్కు చాలానే మార్పులు చేర్పులు చేశారు. షో కు మెయిన్ పిల్లర్లుగా నిలిచిన.. సుధీర్, రష్మీ, పూర్ణ, దీపిక పిల్లిని షో నుంచి తప్పించారని టాక్ నడుస్తోండగా.. పూర్ణ స్థానంలో మరో హీరోయిన్ను పట్టుకొచ్చారు. ఇదే ఇప్పుడు షో రేటింగ్స్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందేమొనన్న అనుమానాలను వ్యక్తం చేస్తోంది.షో లో సుధీర్ రష్మీ ట్రాక్ సక్సెస్ అవ్వగానే.. యాంకర్ ప్రదీప్ తో కలిసి పూర్ణ తో మరో ట్రాక్ నడిపించింది ఢీ యాజమాన్యం.
అయితే ఈ జంట వారంతా మాదిరిగా కాకపోయినా ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ఇప్పుడు పూర్ణ స్థానంలో వచ్చిన నందిత శ్వేతతో వచ్చీ రాగానే ప్రదీప్తో ట్రాక్ను కలిపేందుకు ట్రై చేస్తున్నారు. నందితా కూడా కొత్త పాత లేకుండా స్క్రిప్ట్ ప్రకారం.. ప్రదీప్ కు ఐ లవ్యూలు చెబుతోంది. తెగ సిగ్గుపడుతోంది.డ్యాన్సులు వేస్తోంది. నానా హంగామా చేస్తోంది. అయితే ఈ యవ్వారం ఇప్పుడు బెడిసి కొట్టినట్లు కనబడుతోంది.ఇదిలా ఉండగా షో లో ప్రధాన జడ్జిగా కొనసాగుతున్న ప్రియమణి, హైపర్ ఆదిలు మరింత హద్దు మీరుతున్నట్లు కనిపిస్తోంది. ప్రియమణితో బ్రేకప్ అయిందంటూ ఆది చెప్పడం.. అఖిల్ సార్ధక్, రవి కృష్ణలు ప్రియమణి హగ్గులివ్వడం షో పై ఇంట్రెస్ట్ పోయేలా చేస్తోంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.