Posani Krishna Murali : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 2015లో వచ్చిన సినిమా “టెంపర్”. వరుస పరాజయాలలో ఉన్న ఎన్టీఆర్ కి “టెంపర్” మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి మూర్తి అనే పాత్ర చేయడం జరిగింది. సినిమా మొత్తానికి పోసాని కృష్ణమురళి డైలాగులు పాత్ర చాలా హైలెట్. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ గా పోసాని పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నంది అవార్డ్స్ గురించి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
తనకు అవార్డుల మీద నమ్మకం లేదని కానీ ఎవరికి ఇస్తున్నారు అన్నది అడగటం మరియు ప్రశ్నించడం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు. అందుకే అప్పట్లో నంది అవార్డుల ప్రధానం విషయంలో నిలదీయడం జరిగింది. కులాల ప్రాతిపదికన నంది అవార్డులు ఇస్తున్నారన్న అనుమానం నాకు కలిగింది. ఈ అవార్డుల కారణంగా చాలామంది నష్టపోయారని పోసాని వ్యాఖ్యానించారు. దీంతో తాను ప్రశ్నించడం తట్టుకోలేక అప్పట్లో “టెంపర్” సినిమాకి నంది పురస్కారం ఇవ్వటం జరిగిందని తెలియజేశారు.
అయితే ఇది నంది కాదు కమ్మ అవార్డుగా అనిపించిందని అందుకే తాను తిరస్కరించినట్లు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తీసుకున్న అవార్డు తిరిగి చేయడం జరిగిందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నంది అవార్డుల విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కొత్తవారికి ఇవ్వాలా లేదా పాత వారికి ఇవ్వాలా అనే విషయాలపై ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీకి షూటింగ్ కి సంబంధించిన అనుమతులు కూడా సులువుగా ఉండే రీతిలో కొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.