Prabhas : టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్టార్ అయి తెలుగు సినిమా ఖ్యాతిని భారతదేశ వ్యాప్తంగా చాటుతున్న హీరో ప్రభాస్. ‘బాహుబలి’ సినిమా తర్వాత ఆయన రేంజ్ బాగా పెరిగిపోయింది. కాగా, ప్రభాస్ -అనుష్క ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి కెమిస్ట్రీని చూసి ఆఫ్ స్క్రీన్లోనూ వారు కలిసి మెలిసి ఉండాలని సినీ అభిమానులు కోరుకుంటారు. వీరిరువురి మధ్య ప్రేమ కూడా ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ, అవేవీ నిజం కాలేదు. ప్రభాస్ చేసిన ఓ పని గురించి తెలుసుకుని అనుష్క తీవ్రమైన భావోద్వేగానికి లోనయిందట. ఇంతకీ డార్లింగ్ ఏం చేశాడంటే..
సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ సర్కిల్స్లో తమ మధ్య ఏదో ఉన్నట్లు గాసిప్స్ వచ్చినప్పటకీ అనుష్క కాని ప్రభాస్ కాని వాటి గురించి స్పందించలేదు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని అనుష్క, ప్రభాస్ పేర్కొన్నారు. ప్రభాస్-అనుష్క జోడీగా వచ్చిన ‘మిర్చి, బిల్లా, బాహుబలి 1,2’ సినిమాల్లో వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ గురించి ప్రేక్షకులు ఎప్పుడూ చర్చించుకుంటారు. వెండితెరపైన ముచ్చటగా కనిపించే వీరు జోడీగా ఉండాలని అనుకుంటారు. ఈ సంగతి అలా ఉంచితే..ఇటీవల ఏపీలోని రాజమండ్రికి చెందిన ప్రభాకర్ అనే ప్రభాస్ ఫ్యాన్ ముంబై వెళ్లి ప్రభాస్ను కలిశాడు.
తన అభిమాన హీరో ప్రభాస్ను కలవాలని చాలా కాలం నుంచి ప్రయత్నించిన ప్రభాకర్ ఇటీవల ప్రభాస్ను కలిసి తన కుటుంబ సభ్యులతో కలిసి తన కూతురికి మంచి పేరు పెట్టాలని అడిగాడు. అప్పుడు ప్రభాస్ వెంటనే అనుష్క అని పెట్టేశాడు. ఈ క్రమంలోనే అనుష్క అంత మంచితనం పాపకు రావాలని తెలిపాడట. ఆ విషయం తెలుసుకుని అనుష్క తీవ్రమైన భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయం తెలుసుకుని మొత్తంగా అనుష్క-ప్రభాస్ మధ్య బలమైన బంధం అయితే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఫిల్మ్ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.