Rajamouli about kantara rishab shetty
Rajamouli – Kantara : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో భారీగా వినిపిస్తున్న పేరు కాంతారా. ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు నెల రోజులు కావస్తున్న ఇంకా తెలుగు రాష్ట్రాలలో కాంతారా టాక్ తగ్గలేదు. ఇప్పటికి కూడా కొన్నిచోట్ల కాంతారా సినిమా గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే టాలీవుడ్ , బాలీవుడ్, కొలీ వుడ్ అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కాంతరా సినిమాను డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టి ని పొగిడేస్తున్నారు. అయితే ఈ సినిమా దాదాపుగా 350 కోట్లను వసూలు చేసిందని వార్తలు వస్తున్నాయి.
అయితే కాంతర సినిమాని కేవలం 15 కోట్ల బడ్జెట్ తోనే నిర్మించినట్లు సమాచారం. కేవలం 15 కోట్ల బడ్జెట్లో తీసిన ఈ సినిమా 350 కోట్ల రాబడిని తెచ్చిందంటే సినిమాలో ఎంత దమ్ము ఉందో అర్థం అవుతుంది. దీనికి తోడు కన్నడ మరియు తెలుగు అభిమానులు సైతం ఈ సినిమాలను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు రాజమౌళి కాంతార సినిమాపై స్పందించారు. ఇక రాజమౌళి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారాయి. కాంతారా సినిమాలో రిషాబ్ శెట్టి దేవుడి గెటప్ లో కనిపించి.. అలాగే ఆయన చేసే శబ్దం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడుతుందని చాలా మంది చెప్పారు. సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే అంటూ పలువురు కామెంట్ చేశారు.
Rajamouli about kantara rishab shetty
ఇదే క్రమంలో రాజమౌళి సైతం ఆ మాటను గట్టిగా వినిపించారు. ఓ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ సినిమా కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా సరే భారీ వసూలను సాధిస్తుందని కాంతార నిరూపించింది. భారీ బడ్జెట్ తో వచ్చే సినిమాలు హిట్టు కొట్టడం నార్మల్ గానే జరుగుతుంది కానీ చిన్నచిత్రంగా వచ్చిన సినిమా కాంతారా బాక్సాఫీస్ షేక్ చేసిందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇక ఈ క్రమంలో మాట్లాడుతూ కొందరు జనాలు ఎప్పుడు చూసినా కాంతారా అంటూ భజన చేస్తున్నారని సినిమా బాగా తీశారు, చూశారు ,మెచ్చుకున్నారు అయిపోయింది. పదేపదే మెచ్చుకోవాల్సిన అవసరం ఏముందంటూ మన తెలుగు సినిమాలు కూడా బాగానే ఉన్నాయి కదా అంటూ అసహనం వ్యక్తం చేశారట.
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
Urination Causes : సాధారణంగా బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం పైన ఎటువంటి దృష్టి…
Roja : ఆంధ్రప్రదేశ్లో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో తాజాగా రాజకీయ పరిస్థితులు మరింత వేడెక్కాయి. సాక్షి టీవీకి…
This website uses cookies.