rajinikanth indirect counter to ysrcp leaders
Rajinikanth : టైటిల్ చూసి షాకయ్యారా? అసలు రాజకీయాలకు, రజినీకాంత్ కు ఏంటి సంబంధం. ఆయన ఎందుకు రాజకీయాల్లో వేలుపెడుతున్నారు. రాజకీయాలు అంటేనే ఆయన పెద్దగా పట్టించుకోరు కదా. అది కూడా వైసీపీ నేతలను ఎందుకు టార్గెట్ చేసినట్టు అని అనుకుంటున్నారా? దానికి కారణం ఉంది. అసలు విషయం ఏంటంటే.. రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ ఈనెల 10న విడుదల కాబోతోంది. దాని కోసమే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ ఈవెంట్ లో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజినీకాంత్ దాదాపు గంట సేపు మాట్లాడారు. ఆయన మాటల్లో ఎక్కువగా రాజకీయాల గురించే చర్చ నడిచింది. వైసీపీ నేతలనే టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన వైసీపీ నేతలనే టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారని తెలుస్తోంది. అర్థమైందా రాజా.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల గురించే అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండు జరగని ఊరు లేదు.. అవన్నీ మనం పట్టించుకుంటామా.. అయినా మనం పట్టించుకోవద్దు.
rajinikanth indirect counter to ysrcp leaders
ఇవన్నీ పట్టించుకోకుండా మన పని చూసుకుంటూ ముందుకు పోతూనే ఉండాలి. అర్థమైందా రాజా.. అంటూ జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు రజినీకాంత్. అసలు రజినీకాంత్ కు, వైసీపీకి మధ్య ఎక్కడ చెడింది అంటే.. అది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ద్వారా జరిగిందనే చెప్పుకోవాలి. చంద్రబాబు ఆయన్ను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను గెస్ట్ గా పిలిచారు. ఆ ఈవెంట్ లో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు రజినీ. అప్పటి నుంచి వైసీపీ నేతలు.. రజినీకాంత్ ని కూడా టార్గెట్ చేశారు. రోజా, కొడాలి నాని ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అందుకే వాళ్లకు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు రజినీ.
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్తో మార్కెట్ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
This website uses cookies.