Sai Pallavi : రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో వేణు ఊడుగుల తెరకెక్కించిన చిత్రం విరాట పర్వం.ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతలను మొత్తం సాయి పల్లవి తీసుకుంది. నక్సల్స్ నేపథ్యంలో ప్రేమ, భావోద్వేగాలతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన విరాటపర్వం జూన్ 17న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ చుసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఈ చిత్రంలో విప్లవ నేత రవన్నగా రానా నటిస్తుండగా..సాయిపల్లవి సరళ అనే యువతి (నిజ జీవిత పాత్ర) పాత్ర స్పూర్తిగా సాగే వెన్నెల రోల్లో నటిస్తోంది.
విరాటపర్వం సినిమా అంతా ఓ అమ్మాయి చుట్టే తిరుగుతుందని, ఆ పాత్రని సాయి పల్లవి అద్భుతంగా పోషించిందని, సాయి పల్లవి ఈ సినిమాకి మెయిన్ లీడ్ అని, సాయి పల్లవి కోణంలోనే ఈ కథ నడుస్తుందని, ఒరిజినల్ గా జరిగిన కొన్ని పాత్రల నుంచి ఈ కథ రాశానని డైరెక్టర్ వేణు పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ వెళ్లడంతో అక్కడే నివసిస్తున్న ఒరిజినల్ వెన్నెల క్యారెక్టర్ సరళ కుటుంబ సభ్యులను కలిశారు చిత్ర బృందం. సరళ వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు.. ఆమె అమ్మ నా చేయి పట్టుకొని తన కూతురితో ఎలా మాట్లాడిందో అలానే మాట్లాడింది.
నన్ను హగ్ చేసుకొని ఎక్కడున్నావ్ బిడ్డ, ఎప్పుడొస్తావ్, ఎందుకు వెళ్లిపోయావ్ అని అనడంతో నేను ఏడుపుని ఆపుకోలేకపోయాను. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. సరళ ఫ్యామిలీని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మ నన్ను ఆశీర్వదించి, బొట్టుపెట్టి, చీరను బహుమతిగా ఇచ్చి పంపించారు. వారిని కలిస్తే.. నా కుటుంబ సభ్యులను కలిసినట్లే అనిపించింది. సరళ ఫ్యామిలీ మా సినిమా చూసి హ్యాపీగా ఫీలైతే చాలు’అని సాయి పల్లవి అన్నారు. సాయి పల్లవి కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.