Samantha and Naga Chaitanya between Twitter war
Samantha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చూడ చక్కని జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంత గత ఏడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. డైవోర్స్ తర్వాత ఎవరి లైఫ్ను వాళ్లు లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. విడాకుల వ్యవహారంలో ఎవరిది తప్పు అనే విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరి అభిమానులు ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా హీరోయిన్ శోభితా దూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ లో ఇన్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే చైతూ పై ఈ రూమర్స్ ప్రచారం చేయడం వెనుక సమంత ఉందని అక్కినేని అభిమానులు ఆరోపిస్తున్నారు.
మాజీ భర్త ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ఆమె తన టీమ్ తో కలిసి ఇలాంటి పుకార్లు పుట్టిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య డేటింగ్ రూమర్స్ లో సామ్ హ్యాండ్ ఉందనే నేపథ్యంలో యువ హీరో అభిమానులు ఆమె టీమ్ పై విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. అయితే దీనిపై సమంత ట్విట్టర్ వేదికగా స్పందించింది.”అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే. అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం అమ్మాయే చేయించింది. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. నిజానికి అందులో ప్రమేయం ఉన్న పార్టీలు మూవ్ ఆన్ అయిపోయారు. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి. మీ పని మీద మీ కుటుంబాల మీద దృష్టి పెట్టండి” అని ట్వీట్ చేసింది.
Samantha and Naga Chaitanya between Twitter war
దీనికి వెబ్ సైట్ కథనాన్ని కూడా ట్యాగ్ చేసింది. సామ్ ఈ ట్వీట్ లో ఎక్కడా నాగచైతన్యకు వ్యతిరేకంగా మాట్లాకుండానే.. తనను ట్రోల్ చేస్తున్న వారిని ఎండగట్టే ప్రయత్నం చేసింది. సమాజంలో అమ్మాయిలపై రూమర్స్ వస్తే ఒకలా.. అబ్బాయిల విషయంలో మరోలా వ్యవహరిస్తారనే విషయాన్ని తెలియజెప్పింది. నాగ చైతన్య త్వరలో ధాంక్యూ మూవీతో పాటు లాల్ సింగ్ చద్దా మూవీలతో పలకరించనున్నాడు. మరోవైపు వెంకట్ ప్రభు దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ చేయడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకోవైపు అమెజాన్ ప్రైమ్లో ‘ధూత’ అనే వెబ్ సిరీస్తో చైతూ పలకరించనున్నాడు. అయితే ఇరువురు అభిమానులు ఇలా సోషల్ మీడియలో ట్రోల్స్ చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.