Samantha emotional post on ukraine issues
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పర్సనల్ విషయాలతో పాటు సమాజంలో జరిగే పలు అంశాలపై కూడా స్పందిస్తుంటుంది. తాజాగా ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యపై సమంత స్పందించింది. ఇప్పటికే పలువురు సినీ తారలు ఈ చర్యను తప్పుబట్టారు. యుద్ధం అనేది ఏ కారణాలతో వచ్చినా అది మాత్రం పౌరుల, సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని అన్నారు. రష్యా చర్యలను తప్పు పడుతూ సమంత వరుస పోస్ట్లు చేస్తుండగా, ఇవి నెట్టింట వైరల్గా మారుతున్నాయి.ఉక్రెయిన్లోని ఓ ఆస్పత్రి ఐసీయూ నుంచి నవజాత శిశువులను బాంబ్ షెల్టర్లోకి తీసుకెళ్తున్న ఓ వీడియోను తన ఇన్స్స్టా స్టోరీలో షేర్ చేసిన సమంత.
. అప్పుడే పుట్టిన బిడ్డకు ఎన్ని కష్టాలో అంటూ ఎమోషనల్ కామెంట్ చేసింది. అంతేకాదు యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది. అతని తెగువ, ధైర్యసాహసాలే అందుకు సాక్ష్యం అని పేర్కొన్న ఓ న్యూస్ ఆర్టికల్ని కూడా సామ్ షేర్ చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితులపై ఎంతోమంది సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఐదు రోజులుగా ఉక్రెయిన్ రష్యా బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు దేశాల మధ్య చర్చలు జరగగా, అవి అసంపూర్ణంగా మిగిలాయి.ఇక సమంత సినిమాల విషయానికొస్తే..
Samantha emotional post on ukraine issues
ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా కంప్లీట్ చేసింది. ఆమె కెరీర్లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇది. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది ఎంతగానో అలరించింది. సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు మరో ప్రయోగాత్మక సినిమా ‘యశోద’లో భాగమవవుతోంది సమంత. ఈ సినిమాలో నర్స్ పాత్రలో సమంత రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని సమాచారం. విడాకుల తర్వాత కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన ఆమె.. బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది.
Indian Army : ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ఓ రేంజ్లో నడుస్తుంది. నువ్వా, నేనా అంటూ రెండు…
Sachin Yadavrao Vananje : జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం భారత సైనికుడు సచిన్ యాదవ్రావు…
Vijayashanti : పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్పై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఉగ్రవాదుల పునాది అయిన పాక్లోని స్థావరాలను…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్"…
IPL 2025 : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం దాడులు ప్రతి దాడుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం…
G7 Countries : పాక్ వైఖరి పట్ల ప్రపంచ దేశాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అంతర్జాతీయ…
Anasuya : యాంకర్గా అదరగొట్టిన అనసూయ ఇప్పుడు నటిగాను సత్తా చాటుతుంది. సోషల్ మీడియా లో నిత్యం హాట్ ఫోజులతో…
India Pakistan : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత నాలుగో రోజు కూడా పాకిస్థాన్…
This website uses cookies.