Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, ఆటో రాం ప్రసాద్, గెటప్ శ్రీనుల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ వారిని కలిపింది. ఇక అలా ఒక్కచోటకు వచ్చిన క్షణం నుంచి నేటి వరకు వారు ఎప్పుడూ దూరమవ్వలేదు. ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. కష్టసుఖాల్లో తోడుగా నిల్చున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో సుధీర్, శ్రీను కనిపించడం లేదు.
వారిద్దరూ లేకపోయినా కూడా స్కిట్టును కిందా మీదా పడి లాక్కొస్తున్నాడు రాం ప్రసాద్. అయితే రాకింగ్ రాకేష్ మాత్రం రాం ప్రసాద్ ప్రస్తుత పరిస్థితి మీద, వారి స్నేహం మీద స్కిట్ వేసి అందరినీ ఏడిపించాడు. కెరీర్ కొత్తలో వారు ముగ్గురూ ఎలా ఉండేవారో, ఎలా స్కిట్లు రాసుకునే వారో చూపించాడు. అందులో భాగంగా కొన్ని విషయాలను బయటపెట్టేశాడు. ఈ క్రమంలో కెరీర్ ప్రారంభంలో ఒకరికొకరు ఇచ్చుకున్న గిఫ్టులను చెప్పుకొచ్చారు. గెటప్ శ్రీనుకి పెళ్లైన కొత్తలో కాస్త కష్టంగా ఉంటే.. ట్రావెలింగ్కు ఇబ్బంది అవుతోందంటే..
సుధీర్, రాం ప్రసాద్ కలిసి బైక్ కొనిచ్చారట. ఇక రాం ప్రసాద్ కోసం శ్రీను, సుధీర్ కలిసి కాస్ట్ లీ ఆండ్రాయిడ్ ఫోన్ను గిఫ్ట్గా ఇచ్చారట. మొత్తానికి ఈ విషయాలన్నీ రాకింగ్ రాకేష్ వేసిన స్కిట్ ద్వారా బయటకు వచ్చాయి. ఇక ఈ స్కిట్ చూస్తున్నంత సేపు ఆటో రాం ప్రసాద్ కంటి నుంచి నీరు కారుతూనే ఉంది. అలా ఈ ముగ్గురి స్నేహ బంధం గురించి మొత్తానికి స్కిట్ ద్వారా అందరికీ మరోసారి చూపించినట్టు అయింది. మళ్లీ ఈ ముగ్గురు కలిసి ఎప్పుడు స్కిట్లు చేస్తారో చూడాలి.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.