Tollywood Heroes : బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం.. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై కేసు..!
Tollywood Heroes : గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ కేసు టాలీవుడ్ని కుదిపేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకి పోలీసులు నోటీసులు పంపించగా కొందరు విచారణకి కూడా హాజరయ్యారు. అయితే తాజాగా ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రభాస్, గోపించంద్, బాలకృష్ణలపై కేసు నమోదు చేశారు. ముగ్గురు నటులు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినట్లుగా ఆరోపించారు.
Tollywood Heroes : బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం.. బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై కేసు..!
ఓ టాక్ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు. టాక్లో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరించగా.. స్పెషల్ ఎపిసోడ్లో ప్రభాస్, గోపీచంద్ కనిపించారు. సదరు ప్లాట్ఫామ్ ద్వారా రూ.80లక్షలు కోల్పోయానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫన్88 అనే బెట్టింగ్ యాప్కి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.
ఆ హీరోలు ప్రమోటింగ్ చేయడంతోనే తాను ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు కోల్పోయినట్టు తెలియజేశారు. యాప్ యాక్సెన్ను నిలిపివేయాలని పోలీసులను కోరారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖులు రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అలాగే, యాంకర్స్, యూ ట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు కావడం కూడా మనం చూశాం.
Curry Leaves : ఈ ఆకులని ప్రతి ఒక్కరు కూడా వంటల్లో వినియోగిస్తుంటారు. ఇది లేనిదే వంట కూడా చేయరు.…
Male Ear piercing : మన నాగరికతలో చెవులు కుట్టించే కార్యక్రమాన్ని ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో…
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
This website uses cookies.