Bel Plant : మన హిందూ ధర్మంలో కొన్ని వృక్షాలను దేవత వృక్షాలుగా కీర్తించబడ్డాయి. ఇలా పేర్కొన్న దేవత వృక్షాల్లో మారేడు చెట్టు ఎంతో ప్రముఖమైనదిగా చెప్పబడింది. మారేడు చెట్టుని సంస్కృతంలో బిల్వ వృక్షం అంటారు. బిల్వ వృక్షం శివునికి అత్యంత ప్రీతికరమైనది. త్రిగుణాకారం.. త్రినేత్రం.. క్షత్రిగాయతం చర్ మా పాప: సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ.. మారేడు దళాలతో శివయ్యను పూజిస్తాం. బిల్వపత్రంలోని మూడు ఆకులు శివుని మూడు కళ్ళకు ప్రతీతగా చెప్తారు. లక్ష్మీదేవి కుడి చేత్తో మారేడు చెట్టును సృష్టించినట. అందుకే మారేడు వృక్షాన్ని శ్రీ వృక్షమని మారేడు కాయలు శ్రీఫలమణి కూడా అంటారు. మారేడు చెట్టు ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుందట.
మన పురాణాల్లో చెప్పబడిన 5 లక్ష్మీ స్థానాల్లో మారేడు దళం కూడా ఒకటి. మారేడు చెట్టుకి పువ్వులు పూయకుండానే కాయలు కాయడం విశిష్టతగా చెప్పవచ్చు. అందుకే దీనిని వనస్పతి అని పిలుస్తారు. ముళ్ళు చెట్లను ఇంట్లో పెంచుకుంటే శత్రు బాధలు ఎక్కువ అవుతాయని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఈ దేవత వృక్షానికి అటువంటి పట్టింపు ఏమీ లేదు. ఇంటి పెరట్లో ఖాళీగా ఉన్న ప్రదేశంలో తూర్పు దక్షిణ దిక్కుల్లో మారేడు చెట్టును పెంచుకోవచ్చు.. అయితే ఈ చెట్టు కింద ఈ పరిహారం చేసినట్లయితే కటిక పేదవాడు కూడా ఆ పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఈ చెట్టు మొదట్లో శుభ్రం చేసి చెట్టు మొదలైన పసుపు అలంకరించి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలుచేస్తే కోటి మంది దేవతలకు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఆ చెట్టు కింద పోయేటవేసి ఒక యోగ్యుడికి భోజనం కోటి మంది దేవతలకు మీరు పూజ చేసిందంట పుణ్యం లభిస్తుంది. అయితే మారేడు దళాలతో శివునికి పూజ చేసేటప్పుడు ఈనలను తీయవలసిన అవసరం లేదు. ఈనలను పట్టుకుని శివార్చన చేస్తారు. అయితే మారేడు దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి.
మారేడు దళాలను బుధ, శనివారాల్లో మాత్రమే కోయాలి. చతుర్దశి అమావాస్య ,పూర్ణిమ అష్టమి తిధుల్లో కూడా బిల్వాలను కోయకూడదు. సోమ, మంగళవారము ఆరుద్ర నక్షత్రము, సంధ్యా సమయము రాత్రి వేళయందు శివరాత్రి రోజున పండుగల సమయాల్లో మారేడు పత్రాలను కోయకూడదు. అందుకే ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరిచి ఆదనాలతో పరమశివుని పూజిస్తారు. అలాగే అనారోగ్యాలను దూరం చేసే ఎన్నో ఔషధ గుణాలు కూడా ఈ విలువ వృక్షంలో ఉన్నాయి. గాలిని శుభ్రపరుస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. బెరడు, వేర్లు ఆకులు, పువ్వులు అన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడుతున్నాయి. మారేడు అతిసార వ్యాధికి మొలలకు చక్కర వ్యాధికి మంచి మందుగా పని చేస్తుంది. బిల్వపత్రాల కషాయంలో కొంచెం తేనె కలిపి తాగితే జ్వరం నుండి ఉపశమనం కలుగుతుంది. ఆకులను ముద్దగా నూరి గాయాల మీద అద్దితే అవి త్వరగా మాయం అవుతాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.