Home » Health » Diabetes Symptoms In Telugu 2
Health

Diabetes : మీ గోళ్ళు పసుపు రంగులోకి మారాయా..? చర్మం పై వాపు వచ్చిందా..? అయితే వెంటనే షుగర్ పరీక్ష చేయించుకోవాల్సిందే..!

Authored By
Ramu
The Telugu News | Published on: March 19, 2024, 7:00 am
Advertisement

Diabetes : ప్రస్తుతం మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పుల వలన చిన్న వయసు చిన్న వయసు నుంచి షుగర్ వ్యాధికి గురవుతున్నారు. ఈ షుగర్ వ్యాధి అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఈ షుగర్ వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ అని పిలుస్తారు. డయాబెటిస్ అని పేర్కొనే ఈ వ్యాధి ఇన్సులిన్ ని హార్మోన్ లెవెల్స్ తగ్గడం వల్ల కలిగే అనియంత్రత మెటబాలిజం బ్లడ్ లో అధిక గ్లూకోజ్ లెవెల్స్ వంటి లక్షణాలతో కూడిన ఒక వ్యాధి దీనిని సరియైన ఔషధం అంటూ ఏమీ లేదు.. ఇప్పుడు ఈ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం ఉంటుంది. కాబట్టి ప్రజలు తమ శత్రువులు కూడా ఈ వ్యాధి రాకూడదని అనుకుంటూ ఉంటారు. ఎందుకనగా ఈ స్థితిలో ఆరోగ్యం పట్ల స్వల్ప జాగ్రత్తగా వున్న ప్రమాదంగా మారుతుంది. కాబట్టి షుగర్ ను చాలా మంది సరియైన సమయంలో తెలుసుకోకపోవడంతో అత్యవసర పరిస్థితిలో ఇబ్బందులు పడవలసిస్తోంది.

Advertisement

కావున షుగర్ లక్షణాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని నిపుణులు చెప్తున్నారు. మధుమేహం ఉన్నవారు శరీరంలో ఎన్నో రకాల సంకేతాలను ఇస్తూ ఉంటుంది. మన పాదాలు కొన్ని సంకేతాలను అందిస్తాయి. అవి సమయానికి తెలుసుకోలేకపోతే రక్తంలో షుగర్ లెవెల్స్ ఆకస్మాత్తుగా పెరిగి ప్రమాదానికి దారి చేస్తాయి. మీ పాదాలు కొన్ని సంకేతాలను ఇస్తుంటే వెంటనే రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పాదాల నుంచి ఎటువంటి సంకేతాలు: మీరు షుగర్ వ్యాధిగ్రస్తులైనప్పుడు మీరు షుగర్ న్యూరోపతితో ఇబ్బంది పడవచ్చు. ఇది ఒక వైద్య పరిస్థితి దీనిలో నరాలు దెబ్బతింటాయి. దీని కారణంగా కాళ్లు నొప్పితో పాటు వాపు వస్తుంది. కొన్నిసార్లు కాళ్ల తిమ్మిరి కూడా వస్తుంది. పాదాలలో పుండ్లు: పాదాలలో పుండు గాయాలు రావడం లాంటివి కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. కొన్నిసార్లు చర్మం మీద కూడా మొదలవుతాయి.

ఈ వ్యాధి పరిమితికి మించి పురోగతిమిస్తే వాటిని తీసేయాల్సి ఉంటుంది. అందుకే మీరు మధుమేహాన్ని సరియైన కారణం గుర్తించడం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడం చాలా అవసరం.
చర్మం గట్టిపడడం: మీకు మధుమేహం ఉన్నట్లయితే మీ అరికాళ్ళు చర్మం పాదాలు గట్టిగా అవ్వడం మొదలవుతాయి. అయితే ఇది బూట్లు, చెప్పుల వల్ల కూడా రావచ్చు.. ఇటువంటి సమస్య లేకపోతే బ్లడ్ లో షుగర్ పరీక్ష చేయించుకోండి. దానివలన మీ లక్షణాలు తనకి చేయవచ్చు. మధుమేహం కారణంగా సాధ్యమయ్యే నష్టాలను నివారించడానికి ప్రయత్నించండి. గోళ్ళు పసుపు రంగులోకి రావడం: మధుమేహం వచ్చినప్పుడు గోళ్ళు రంగు మారుతూ ఉంటుంది. సహజంగా లేత గులాబీ రంగులో ఉన్న మన గోర్లు అకస్మాత్తుగా పసుపు రంగులోకి రావడం మొదలవుతాయి. ఈ మార్పును తేలికగా తీసుకోకండి. మీ రక్తాన్ని వెంటనే పరీక్ష చేయించుకోండి. సకాలంలో వైద్యం తీసుకోండి.

Ramu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి