Vegetables : ప్రస్తుత కాలంలో పంటలకు రసాయనాలు వాడకం చాలా బాగా పెరిగిపోయింది. అయితే కూరగాయలు మరియు పండ్లను పండించే రైతులు కీటకాల నుండి రక్షించేందుకు ఎంతో హానికరమైన రసాయనా లను వాడుతున్నారు. అలాగే దిగుబడి రేటు పెరిగేందుకు కూడా రకరకాల రసాయనాలను మరియు పురుగు మందులను ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇలా రసాయనాలు చల్లిన ఆహారాలు అనేవి ఆరోగ్యానికి అసలు మంచివి కాదు. అయితే కూరగాయల నుండి రసాయనాలను ఎలా తొలగించాలి. వాటిని ఎలా. వాడుకోవాలి. అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే ఈ కింది చిట్కాలను పాటించటం వలన కొంతవరకైనా మనం వాటి ప్రభావం నుండి బయటపడవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కూరగాయలను ఉడికించే ముందు గోరువెచ్చ ని నీటిలో శుభ్రంగా కడిగితే టాక్సిన్స్ అనేవి బయటకు పోతాయి. అలాగే అధిక వేడి లేక చల్లటి నీటిలో కడగటం వలన ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అందువలన గోరువెచ్చని నీటితోనే శుభ్రం చేయాలి. అంతేకాక పండ్లను కూడా ఇదే విధంగా కడిగి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాక ఒక పెద్ద గిన్నెలో నీరు తీసుకొని ఒక అర చెంచా ఉప్పు వేసుకోవాలి. దీంతో ఉప్పు అంత కూడా నీటిలో బాగా కలుస్తుంది. అప్పుడు ఈ ఉప్పు నీటిలో పండ్లను మరియు కూరగాయలను వేసి బాగా కడగాలి. ఆ తర్వాత వాటిని నార్మల్ నీటితో కడిగితే చాలు. ఇలా చేయడం వలన ఆహారం రసాయనాల రహితంగా మారతాయి.
ఎన్నో రకాల రసాయనాలు అనేవి కూరగాయల తొక్కలపై బాగా పేరుకొని పోతాయి. ఇవి క్రిమిసంహారకాలను తొలగించేందుకు నీటితో కడిగిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో వెనిగర్ వేసి కాసేపు నానబెట్టుకోవాలి. దాని తర్వాత సాధారణ నీటిలో కడిగితే చాలు. తర్వాత వంటకు వాడుకోవచ్చు. అప్పుడు ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. అంతేకాక ఉల్లిపాయ, బంగాళదుంప, యాపిల్, నారింజ, అల్లం, మామిడి, క్యారెట్,ముల్లంగి, దుంప లాంటి పండ్లు మరియు కూరగాయలను తొక్క తీయటం కూడా ఎంతో సులభం అవుతుంది. ఈ ఆహారాన్ని బాగా కడిగిన తర్వాత మాత్రమే దానిపైన ఉన్నటువంటి తొక్కను తీసివేయాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక కప్పు నీటిలో వేసి పలుచగా చేసుకోవాలి. దీనిని ఒక స్ప్రే బాటిల్ లో పోసుకొని చల్లని ప్రదేశంలో భద్రపరచుకోవాలి. ఈ మిశ్రమాన్ని పండ్లు మరియు కూరగాయలపై స్ప్రే చేసిన కూడా మంచి ఫలితం ఉంటుంది…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.