Home » Health » Funnel Seeds
Health

Funnel Seeds : మీరు తిన్న ఆహారం జీర్ణం కావాలన్నా.. మీ రక్తంలో చక్కర స్థాయిలు తగ్గాలన్న… ఇదోక్కటే మార్గం…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: August 11, 2025 6:52 pm
Advertisement

Funnel Seeds : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా డయాబెటిస్ మారిన పడుతూనే ఉన్నారు. వారి సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. ఇది ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య.ఇది ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం శరీరంలో ఉంటుంది. కాబట్టి,దీనిని అదుపులో ఉంచుకొనుటకు,కొన్ని ప్రకృతి ఇచిన ఔషధాలతో కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్ స్థాయిలు తగ్గించాలంటే సురక్షితమైన సహజమైన గృహ చికిత్సల కోసం వెతుకుతూ ఉంటారు.అటువంటి చికిత్సలు ఒకటి. వంట ఇంట్లోనే తేలిగ్గా దొరికే ఈ పదార్థం దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం వాటిల్లుతుంది. లో అధిక షుగర్ లెవెల్స్ పెరిగితే గుండె ఆరోగ్యానికి ఆటంకాన్ని ఏర్పరుస్తుంది. దీనితో హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.ఇంకా కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఆహారంలో జీవనశైలిలో అవసరమైన మార్పులు చోటు చేసుకోవడం ద్వారా రక్తంలో డయాబెటిస్ స్థాయిలు నియంత్రించవచ్చు. దీనికి ముఖ్యంగా ఉపయోగపడే పదార్ధం సోంపు విత్తనాలు. ఇవి డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

Advertisement

Funnel Seeds : మీరు తిన్న ఆహారం జీర్ణం కావాలన్నా.. మీ రక్తంలో చక్కర స్థాయిలు తగ్గాలన్న… ఇదోక్కటే మార్గం…?

ఒంపు గింజలు మన వంట గదిలో ఉండే ఒక సాధారణ పదార్థం వీటిని వంటల్లో రుచి కోసం నోటి దుర్వాసన పోగొట్టుకొనుటకు ఉపయోగిస్తుంటారు అంతేకాదు బ్లడ్ షుగర్ స్థాయిలో నియంత్రించుటకు కూడా ఇది శక్తివంతమైన ఔషధ గుణంలో కలిగిన మందు. మామూలుగానే ఫైబర్ విటమిన్లో ఖనిజాలు ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిలో పోషకాలు రక్తంలో గ్లూకోస్ స్థాయిలను అదుపులో ఉంచుటకు సహకరిస్తుంది.ముఖ్యంగా, సోంపులో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల గ్లూకోస్ రక్తంలో నెమ్మదిగా విడుదలవుతుంది.ఇది భోజనం తర్వాత బ్లడ్ షుగర్ స్థాయిలను ఆకస్మికంగా పెరగకుండా నిరోధిస్తుంది.

Advertisement

Funnel Seeds  సోంపు గింజలతో వాటర్ తయారు చేయడం

గ్లాస్ నీటిలో ఒకటి స్పూన్ సోంపు గింజలు వేసి ఈ నీటిని రాత్రంతా నానబెట్టాలి తరువాత మరునాడు ఉదయం ఈ నీటిని వడకట్టి పరగడుపున తాగాలి. ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటూ వస్తే బ్లడ్ లో షుగర్ స్థాయిలో అదుపులోకి వస్తాయి. అంతేకాదు, డయాబెటిస్ పూర్తిగా పరిష్కారం కాదు. కానీ కేవలం ఒక సహాయక చికిత్స మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మీరు షుగర్ వ్యాధితో బాధపడుతుంటే తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి వారు సూచించిన మందులను కూడా వినియోగించాలి. సోంపు గింజలు నీటిని ఒక అనుబంధ చికిత్సగా మాత్రమే ఉపయోగించుకోవాలి. నియంత్రించడానికి సోంపు గింజలు నీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా ముఖ్యమే, జీవనశైలిలోని మార్పులు మధుమేహానే సమర్ధంగా నియంత్రించడానికి సహకరిస్తుంది. సోంపు గింజలలో ఫైబర్, విటమిన్ సి,క్యాల్షియం,మెగ్నీషియం, పొటాషియం,ఐరన్ మొదలైన మూలకాలు కలిగి ఉంటాయి. అవి ఆంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నట్లు తెలుపుతుంది. సోంపు గింజల్లో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో శరీరం లోని ఇన్సులిన్ పరిమాణాన్ని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. మీరు సోంపు గింజలను అలాగే తినవచ్చు. లేదా సోంపు గింజలను రాత్రి నానబెట్టి తరువాత మరునాడు ఉదయం తాగవచ్చు. ప్రతిరోజు భోజనం తర్వాత నానబెట్టిన నీటిని తాగితే రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రణలోకి వస్తాయి.ఇంకా బరువు తగ్గటానికి కూడా దోహదపడుతుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి