
Rice Roti : రైస్ లేదా చపాతి... ఈ రెండిట్లో ఏది తింటే బరువు త్వరగా తగ్గుతారు...!
Rice Roti : ప్రస్తుత కాలంలో బరువు తగ్గాలని, స్లిమ్ గా ఉండాలని, అందంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే అధిక బరువు పెరగటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. వెయిట్ తగ్గాలని ఎన్నో రకాల డైట్స్ ను ఫాలో అవుతుంటారు. అలాంటి డైట్ లో రైసు లేదా చపాతి ఈ రెండిట్లో ఏది తింటే బరువు తగ్గుతారు అనే దానిపై ఇప్పుడు తెలుసుకుందాం… అధిక బరువు తగ్గాలంటే మనం తినే ఆహార పదార్థంలో ఎక్కువగా ప్రోటీన్లు ఉండేటట్లు తీసుకోవాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగి ఉండాలి అని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మన ఇండియన్ కల్చర్ లో భోజనం చేసే సమయంలో రైస్ తో పాటు రోటీలు కూడా ఉండాల్సిందే… కానీ అందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. మరి బరువు తగ్గేదెలా అని అనుకుంటున్నారా..?
Rice Roti : రైస్ లేదా చపాతి… ఈ రెండిట్లో ఏది తింటే బరువు త్వరగా తగ్గుతారు…!
అధిక బరువు తగ్గించుకోవాలని అనుకునేవారు రాత్రి సమయంలో తేలికపాటి భోజనాన్ని తీసుకోవాలి. అంతేకానీ ఫుల్ గా భోజనం తిని బరువు తగ్గాలంటే తగ్గరు. రోజు అన్నం తినగానే పడుకోకూడదు. డైలీ వాకింగ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఒక డౌట్ ఉంది. అది ఏమిటంటే రైస్, రోటి ఈ రెండిట్లో ఏది బెటర్ అని అడిగితే… వరి అన్నంలో అతి తక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది. అలాగే 120 గ్రాముల గోధుమలలో 190 ఎం.జి సోడియం ఉంటుంది. క్యాలరీలు, ఒక గ్రామ్ ప్రోటీన్, 0.1 గ్రాముల కొవ్వు, 18 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. చపాతి గోధుమల నుండి తయారు చేస్తారు కాబట్టి బియ్యంతో పోలిస్తే ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి.
ఒక చిన్న 6 అంగుళాల చపాతీలో దాదాపు 71 కేలరీలు, మూడు గ్రాముల ప్రోటీన్, 0.4 గ్రాములకు కొవ్వు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. గోధుమలతో పోలిస్తే ఊరిలో మెగ్నీషియం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బియ్యం గోధుమలు రెండు ఒకే పరిమాణంలో ఫోలేట్, ఐరన్ కలిగి ఉంటాయి. చపాతి మరియు అన్నం రెండు సొంత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బియ్యం పప్పు కలిసి అందులో అన్ని అమైనొ ఆమ్లాలు ఉంటాయి. జొన్న,బార్లీ, వేలు లేదా ముత్యాల మిల్లెట్ తో చేసిన రోటీ వల్ల క్యాల్షియం, ఫాస్పరస్, జింకు వంటి పోషకాలు మీకు అందుతాయి. ఈ రెండు ఆరోగ్యానికి మంచివే కాబట్టి.. ఒకరోజు రైసు, ఒకరోజు రోటి తింటే బరువు త్వరగా తగ్గించుకోవచ్చు. అయితే బరువు తగ్గాలనుకునే వారు మాత్రం పోర్షన్ సైజ్ ల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. రాత్రి సమయంలో 8 గంటలలోపే డిన్నర్ చేసేయాలి. లేటుగా భోజనం చేయడం వలన అనారోగ్య సమస్యల బారిన పడతాము. కావున మనము ప్రతిరోజు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. టైం ప్రకారం భోజనం చేయాలి. టైం ప్రకారం నిద్రపోవాలి. కానీ ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ లో పాటించడం సాధ్యం కావడం లేదు. అందుకే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కావున వీలైనంతవరకు ఉన్న టైంలో నైనా టైం ప్రకారం ఎంత పని ఉన్నా సరే మర్చిపోవద్దు. ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యమే మహాభాగ్యం.
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
This website uses cookies.