
Former Minister Jagadish Reddy criticizes Telangana government
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బయటపడుతోందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో లంచాలు ఇవ్వలేదనే కారణంతో రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి, అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇది రాజకీయ ప్రతీకార చర్యల భాగమని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. రైతుబంధు నిధులను విడుదల చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, దళారులకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.
Jagadish Reddy : నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి బట్టబయలైంది : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
యూరియా, విద్యుత్, సాగునీరు వంటి మౌలిక అవసరాలు కూడా అందించలేకపోతున్న ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. గత పదేళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగిందని, కరోనా కాలంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి నిధులు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రైతుబంధు డబ్బుల విషయంలో హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు స్వర్ణయుగం నెలకొన్నదని ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
This website uses cookies.