
Former Minister Jagadish Reddy criticizes Telangana government
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బయటపడుతోందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో లంచాలు ఇవ్వలేదనే కారణంతో రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి, అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇది రాజకీయ ప్రతీకార చర్యల భాగమని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. రైతుబంధు నిధులను విడుదల చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, దళారులకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.
Jagadish Reddy : నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి బట్టబయలైంది : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
యూరియా, విద్యుత్, సాగునీరు వంటి మౌలిక అవసరాలు కూడా అందించలేకపోతున్న ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. గత పదేళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగిందని, కరోనా కాలంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి నిధులు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రైతుబంధు డబ్బుల విషయంలో హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు స్వర్ణయుగం నెలకొన్నదని ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
This website uses cookies.