
Former Minister Jagadish Reddy criticizes Telangana government
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బయటపడుతోందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో లంచాలు ఇవ్వలేదనే కారణంతో రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి, అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇది రాజకీయ ప్రతీకార చర్యల భాగమని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. రైతుబంధు నిధులను విడుదల చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, దళారులకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.
Jagadish Reddy : నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి బట్టబయలైంది : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
యూరియా, విద్యుత్, సాగునీరు వంటి మౌలిక అవసరాలు కూడా అందించలేకపోతున్న ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. గత పదేళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగిందని, కరోనా కాలంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి నిధులు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రైతుబంధు డబ్బుల విషయంలో హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు స్వర్ణయుగం నెలకొన్నదని ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.