Municipality Elections : ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతల జోరు
Municipality Elections : ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు.మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రాజా బొల్లారం, రాజా బొల్లారం తండా, ఘన్పూర్, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన భారీ రోడ్ షోలో పాల్గొని, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
Municipality Elections : ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతల జోరు
అనంతరం ఆయా గ్రామాలలో కార్నర్ మీటింగులు నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీనే సరైన ఎంపిక అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాలలో ఎల్లం పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విగ్నేశ్వర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
