
గ్రీన్ చాలెంజ్ తరహాలోనే వైట్ చాలెంజ్ స్వీకరించి డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని నామినేట్ చేసిన సంగతి అందిరికీ తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వారు ఇరువురు హైదరాబాద్ అమరవీరుల స్తూపం వద్దకు రావాలని కోరారు. అయితే, మంత్రి కేటీఆర్ ఈ విషయమై డిఫరెంట్గా స్పందించారు. చాలెంజ్ స్వీకరించకుండా టీపీసీసీ చీఫ్ రేవంత్పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు మంత్రి కేటీఆర్. కాగా, సోమవారం గన్పార్క్ వద్దకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైట్ చాలెంజ్ సమాజానికి అవసరమైన చాలెంజ్ అని చెప్పారు. రేవంత్ చాలెంజ్ను మంత్రి కేటీఆర్ స్వీకరించి ఉంటే కనుక ఆయన స్థాయి పెరిగేదని అభిప్రాయపడ్డారు. సింగరేణి ఘటన డ్రగ్స్ వల్లే జరిగిందన్నారు.
ఎన్నికల్లో నిలబడే ప్రతీ ఒక్కరు వైట్ చాలెంజ్ స్వీకరించి టెస్టులు చేయించుకోవాలన్నారు. ఇకపోతే ఈ డ్రగ్స్ టెస్టుల లొల్లిలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధం లేదని, కేటీఆర్ రాహుల్ గాంధీ గురించి తొందరపడి మాట్లాడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే కొండా వైట్ చాలెంజ్కు మరో ఇద్దరు నేతలను నామినేట్ చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్, ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ వైట్ చాలెంజ్ స్వీకరించి యువతకు ఆదర్శంగా నిలవాలని కొండా సవాల్ విసిరారు.
Gold : ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎంతో ఆసక్తి…
Harsha Veena : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హర్ష వీణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్…
RK Roja : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఇప్పుడు…
Prabhas vs Dhurandhar : తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన సినిమా బాహుబలి 2. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్…
Students : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు వారి విద్యా భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన…
Viral video : భారత క్రికెట్ స్టార్, ఆర్సీబీ కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో…
IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి నేటి నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీస్ ఉన్నతాధికారి వీసీ…
LPG Gas : దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాపై ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా…
IPL 2026 : నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ…
Ration Card : కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించాలనే నిర్ణయంతో రాష్ట్రాలకు మార్గదర్శకాలు…
EPFO : దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా ఒక ముఖ్యమైన భద్రతా…
Gold Silver Rates March 28 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్డేట్ మీకోసమే.…
This website uses cookies.