
Sridhar Babu : విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నాం.. మంత్రి శ్రీధర్బాబు
Sridhar Babu : హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నట్టుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్బాబు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి ఆపకుండా పనులు చేస్తున్నట్టుగా చెప్పారు. టీడీఆర్ అనేది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిందేనన్నారు. ఆయన సమయంలో చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీఆర్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని ఆరోపించారు.
Sridhar Babu : విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నాం.. మంత్రి శ్రీధర్బాబు
ఉప్పల్,రామంతాపూర్ డివిజన్ లలో రూ. 42 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంగళవారం జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మోతె శ్రీలత, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ మందుముల పరమేశ్వర్రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, బండారు శ్రీవాణి, స్వర్ణరాజ్ శివమణితో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఉప్పల్ వార్డు కార్యాలయంలో ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఉప్పల్ తో పాటు రాష్ట్రమంతా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేశామన్నారు. నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకు ఎన్ని నిధులైన అందిస్తామన్నారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా మరింత గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టుగా చెప్పారు. గత పాలకులు పట్టించుకోని కాలుష్య నివారణ, స్వచ్ఛమైన గాలి, వాతావరణం కు తోడు అభివృద్ధి వేగవంతం చేసేందుకే మూసి ప్రక్షాళన కు ప్రభుత్వం స్వీకారం చుట్టిందన్నారు.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ప్రజలకు విద్య, వైద్యం, తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రపంచంలోని పారిశ్రామిక దేశాలకు దీటుగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని యువతకు సాంకేతిక శిక్షణ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. యువత అభివృద్ధితో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని కూడా చేస్తున్నామన్నారు.
గోదావరి, కృష్ణా జలాలతో రిజర్వాయర్లు ఏర్పాటు చేసి జంట నగరాల దాహార్తి తీరుస్తామన్నారు. టిడిఆర్ కార్యక్రమం కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. టిడిఆర్ ఇంకా ప్రారంభం కాలేదన్నారు. కానీ కేటీఆర్ వారికి సంబంధించిన అవినీతి బయటపడుతుందని విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని గుర్తు చేశారు. నిధుల కొరత వెంటాడుతున్నా, నిధులు లేకున్నా గ్రేటర్ హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రతిపక్షాల నిర్మాణాత్మకమైనసూచనలు, సహకారాన్ని తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి పలు విషయాలను తీసుకెళ్లారు. ఉప్పల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు. అయినా సీఎం రేవంతన్న, మంత్రి శ్రీధర్ బాబు గారు ఎలాంటి వివక్ష చూపకుండా.. ఉప్పల్ ప్రజల కోసం అభివృద్ధి పనులకు కావాల్సినన్ని నిధులు ఇస్తున్నారని గుర్తు చేశారు.
ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో మన ఉప్పల్, రామంతపూర్ డివిజన్లలో ఒకే రోజు దాదాపు రూ.50 కోట్ల అభివృద్ధి పనులు మొదలు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత 10 సంవత్సరాలుగా నిధులు లేక ఇబ్బంది పడ్డ ఉప్పల్ నియోజకవర్గ వాసులకు సీఎం రేవంతన్న, శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో నిధులు మంజూరు అవుతున్నాయి.
నేడు మన నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా చేపడుతూ సమస్యలను మంత్రిగా శ్రీధర్ బాబుగా తీరుస్తున్నారన్నారు. ఉప్పల్ సర్కిల్ లోని మూడు డివిజన్లల్లో ఏళ్ల తబరడి ట్రంక్ లైన సమస్య పెండింగ్లో ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్రెడ్డిగారు, మంత్రి శ్రీధర్ బాబు గారి ఇద్దరి కృషితో రూ.8 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా సూపర్ సక్కర్ అనే యంత్రంతో ట్రంక్ లైన్ క్లీనింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. ఉప్పల్ వాసుల కోరిక మేరకు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఉప్పల్ భాగాయత్ లో మొదలు పెట్టాలని మంత్రిని కోరారు. ఉప్పల్ భగాయత్ లో జాగా ఉంది కాబట్టి.. దీనిలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి స్థలం, కావాల్సిన నిధుల విషయాన్ని ఇప్పటికే మీ దృష్టికీ తేవడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా ఈ పనులను కూడా చేయాలని కోరారు.
నియోజకవర్గంలో ఎస్ఎన్డీపీ కింద పలు పనులకు రూ.101 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనుల శంకుస్థాపనకు సీఎం రేవంత్రెడ్డి గారిని నియోజకవర్గానికి తీసుకు రావాలని, వారితో కలిసి మీరు ఈ పనులకు శంకుస్థాపన చేయాలని శ్రీధర్బాబుగారిని మనస్ఫూర్తిగా కోరుతున్నట్టుగా చెప్పారు. ప్రతి విషయంలోనూ సహకరిస్తూ వస్తున్న.. విప్ పట్నం మహేందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల కాంగ్రెస్ నాయకులు, పలు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
This website uses cookies.