Home » Hyderabad » Viral News Husband Wife Chutney
hyderabad

Viral News : భోజ‌నంలో చ‌ట్నీ ఎక్క‌వ వేసావ‌ని అలిగిన‌ భ‌ర్త‌.. సూసైడ్ చేసుకున్న భార్య..!

Authored By
Jyothi Marikanti
The Telugu News | Published on: January 9, 2024, 5:00 pm
Advertisement

Viral News : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఓవిషాదం చోటుచేసుకుంది. చట్నీ విషయంలో తలెత్తిన గొడవ గొడవ భార్య ఆత్మహత్యకు దారితీసింది. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే టైంలో చట్నీ ఎక్కువ వేసావ్ అంటూ రమణ భార్యతో గొడవపడ్డాడు.. సోమవారం అతడు విధుల్లోకి వెళ్ళగా.. రమణకి తన భార్య పలుమార్లు వీడియో కాల్ చేసింది.

Advertisement

అతడు స్పందించకపోవడంతో ఫోన్ చేసి కావాలనే తనతో గొడవ పడుతున్నావు అంటూ పెద్దగా కేకలు వేసింది.తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అనుమానం వచ్చిన రమణ యజమానికి ఫోన్ చేసి తన ఇంటి వెళ్ళమని యజమాని కోరారు.. యజమాని విరిగు పొరుగుని తీసుకొని వెళ్లి తలుపులు పగలకొట్టి లోపలికి ప్రవేశించగా అప్పటికే చందన విగత జీవిగా మిగిలింది. చందన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. కొత్తగూడెం తండా కి చెందిన రమణ. ఖమ్మం జిల్లా తండకు చెందిన చందనను రమణ ప్రేమ వివాహం చేసుకున్నాడు.. బానోతు రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చందన ఓ ఆభరణాల దుకాణంలో వర్కర్ గా పనిచేస్తుంది. వీరిద్దరూ బంజారా హిల్స్ ఇందిరానగరలోని అపార్ట్మెంట్లో ఉంటున్నారు. చిన్న విషయంలో ప్రాణాలు తీసుకుంది చందన. ఈ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

Jyothi Marikanti

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి