
Success Story of Woman : ఒకే ఎకరం.. రూ. 7 లక్షల లాభం ఆరెంజ్ సాగులో అద్భుతం సృష్టిస్తున్న మహిళా రైతు..!
Success Story of Woman – Bharti Pohorkar వ్యవసాయం దండగ అనే రోజుల్లో, సరైన శాస్త్రీయ విధానాలు పాటిస్తే వ్యవసాయం పండుగ అని నిరూపించారు మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు. భారీ వర్షాలకు చుట్టుపక్కల రైతుల పంటలన్నీ దెబ్బతిన్నా, ఆమె తోట మాత్రం పచ్చగా కళకళలాడింది. కేవలం ఒక ఎకరం 4 గుంటల భూమిలో ఆరెంజ్ Nagpur Santra సాగు చేసి ఏకంగా రూ.7 లక్షల లాభం గడించి అందరికీ ఆదర్శంగా నిలిచారు 38 ఏళ్ల భారతి అరుణ్రావు పోహోర్కర్.
Success Story of Woman : ఒకే ఎకరం.. రూ. 7 లక్షల లాభం ఆరెంజ్ సాగులో అద్భుతం సృష్టిస్తున్న మహిళా రైతు..!
భారతిది అమరావతి జిల్లాలోని చందూర్ బజార్ తాలూకా కరజ్గావ్ గ్రామం. ఆమె MCom చదివి మొదట్లో పార్ట్ టైమ్ అకౌంటెంట్గా పనిచేశారు. కానీ, ఆఫీస్ పని ద్వారా వచ్చే జీతం తమ పొలంలో కూలీల ఖర్చులకు కూడా సరిపోవడం లేదని గ్రహించారు. దీంతో ఉద్యోగాన్ని వదిలేసి, తన 68 ఏళ్ల తల్లి సుమిత్రతో కలిసి పూర్తిస్థాయిలో వ్యవసాయం బాధ్యతలు స్వీకరించారు. విదర్భ ప్రాంతంలో మహిళలు ఇలా ఒంటరిగా వ్యవసాయం చేయడం చాలా అరుదు.
భారతి తనకున్న కొద్దిపాటి భూమిలో 180 రంగ్పురి నాగ్పూర్ సంత్ర Rangpuri Nagpur Santra అంటుకట్టిన మొక్కలను నాటారు. చెట్లు పెరిగే లోపు, ఆదాయం కోసం ఉల్లిపాయలను అంతరపంటగా సాగు చేశారు. కూలీల కొరత ఉన్నప్పటికీ కలుపు తీయడం, నీరు పెట్టడం, మందులు పిచికారీ చేయడం వంటి పనులన్నీ స్వయంగా తానే చూసుకున్నారు.
“మొదట్లో ఇదంతా ఆడవాళ్ల వల్ల అయ్యే పని కాదని చాలామంది అన్నారు. కానీ ఇప్పుడు నా చెట్లే వారికి సమాధానం చెబుతున్నాయి” అని భారతి గర్వంగా చెబుతారు. ఆమె కృషికి గుర్తింపుగా 2023లో ‘ఉత్తమ యువ మహిళా రైతు’ అవార్డు కూడా దక్కింది.
సాధారణంగా నాగ్ పూర్ సంత్ర చెట్లు ఒక ఏడాది విపరీతంగా కాపు కాస్తే, మరుసటి ఏడాది Alternate bearing దిగుబడి తగ్గిపోతుంది. దీనికి సరైన నీటిని మేనేజ్ చేయడం, ప్రూనింగ్ (కొమ్మలు కత్తిరించడం) లేకపోవడమే కారణం. భారతి ఈ సమస్యను శాస్త్రీయంగా ఎదుర్కొన్నారు.
Success Story of Bharti Pohorkar : ఒకే ఎకరం.. రూ. 7 లక్షల లాభం: ఆరెంజ్ సాగులో అద్భుతం సృష్టిస్తున్న మహిళా రైతు
చెట్లకు బేసిన్ ఇరిగేషన్ పద్ధతిలో నేరుగా వేర్లకే నీరు అందేలా చేశారు. మొక్కల దశలో తరచుగా, పెద్ద చెట్లకు 7-10 రోజులకు ఒకసారి నీరు అందించారు. పూత వచ్చే సమయంలో మాత్రమే నీటి ఎద్దడి సృష్టించి సరైన సమయంలో పూత వచ్చేలా జాగ్రత్తపడ్డారు. ఒకేసారి కాకుండా దఫదఫాలుగా పోషకాలు అందించారు. ఎక్కువ పూత, బలహీనమైన కాయలను తెంపేయడం ద్వారా చెట్టు బలాన్ని కాపాడారు.
రసాయనాల వాడకాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన పద్ధతులను భారతి ఎంచుకున్నారు. సంత్ర చెట్ల వరుసల మధ్య బంతి పూల Marigolds మొక్కలను పెంచారు. బంతి మొక్కల వేర్ల నుంచి వచ్చే సమ్మేళనాలు నేలలోని నెమటోడ్ (నులిపురుగులు) తెగుళ్లను నాశనం చేస్తాయి. అలాగే బంతిపూల అమ్మకం ద్వారా అదనపు ఆదాయం కూడా వచ్చింది. పండు ఈగలను Fruit flies ఆకర్షించి చంపేందుకు పసుపు రంగు జిగురు అట్టలను Yellow sticky traps, సోలార్ లైట్ ట్రాప్స్ ను ఉపయోగించారు. కాండం కుళ్లు తెగులు రాకుండా చెట్ల మొదళ్లకు బోర్డోక్స్ పేస్ట్ పూశారు.
సమస్యాత్మక వాతావరణంలోనూ, గతేడాది కేవలం 7 టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది ఏకంగా 15 టన్నుల నాణ్యమైన సంత్ర కాయలను పండించారు భారతి. వాతావరణం అనుకూలించకపోయినా, శాస్త్రీయ పరిజ్ఞానం, సహనం, నేలతో మమేకమై పనిచేస్తే ఎంతటి కష్టనష్టాలనైనా అధిగమించి లాభాలు సాధించవచ్చని భారతి పోహోర్కర్ నిరూపించారు.
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
This website uses cookies.