
Are these the benefits of the India-US trade agreement for India?
India Us Tariffs : భారత్–అమెరికా మధ్య నెలల తరబడి కొనసాగిన కీలక చర్చలు సఫలమయ్యాయి. రెండు దేశాలు ఎట్టకేలకు ఒక ముఖ్యమైన వాణిజ్య ఒప్పందానికి అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటన చేశారు. ఈ ఒప్పందంతో భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు గణనీయంగా తగ్గాయి. అంతేకాదు రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించనున్న అదనపు సుంకాలను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామాలు భారత్కు ఆర్థికంగా ఊరటనిచ్చే అంశాలుగా మారాయి.
India Us Tariffs : ట్రంప్ సుంకాల ప్రకటనతో భారత్కు కలిగే లాభాలు ఇవేనా .. ?
అమెరికా ఇప్పటివరకు భారత ఉత్పత్తులపై 25 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధించేది. తాజా ఒప్పందంతో వాటిని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అదనంగా, రష్యా నుంచి చమురు దిగుమతులపై విధించాలనుకున్న మరో 25 శాతం అదనపు సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదిక ద్వారా వెల్లడించారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయడానికి అంగీకరించిందని ఆయన పేర్కొన్నప్పటికీ ఈ అంశంపై భారత్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ ఒప్పందం భారత్ను అమెరికా మార్కెట్లో మరింత పోటీగా నిలబెడుతోందని వాణిజ్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చైనా, పాకిస్తాన్, వియత్నాం వంటి పొరుగు దేశాలతో పోలిస్తే భారత్కు తక్కువ సుంకాలు వర్తిస్తున్నాయి. బ్రెజిల్పై 50 శాతం, మయన్మార్, లావోస్లపై 40 శాతం, చైనాపై 37 శాతం, దక్షిణాఫ్రికాపై 30 శాతం సుంకాలు ఉన్నాయి. మరోవైపు వియత్నాం, బంగ్లాదేశ్లపై 20 శాతం, పాకిస్తాన్, మలేషియా, కంబోడియా, థాయిలాండ్లపై దాదాపు 19 శాతం సుంకాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్పై 18 శాతం మాత్రమే సుంకం ఉండడం వల్ల భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాక..గత కొంతకాలంగా డాలర్కు గిరాకీ పెరిగి రూపాయి విలువ క్షీణిస్తూ వచ్చింది. అయితే పరిణామాలతో భారత్ మార్కెట్లు కోలుకుంటాయని రూపాయి విలువ బలపడుతుందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ట్రంప్కు కృతజ్ఞతలు తెలుపుతూ..“మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు తగ్గడం 1.4 బిలియన్ భారతీయులకు లాభదాయకం” అని పేర్కొన్నారు. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారం ప్రజలకు మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా సుంకాల భయం రష్యా చమురు అంశాలతో రూపాయి బలహీనపడగా తాజా పరిణామాలతో మార్కెట్లు కోలుకునే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒప్పందానికి సంబంధించిన పూర్తి నిబంధనలు అమలు తేదీపై ఇరు దేశాలు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రష్యా కూడా ఈ అంశంపై మౌనం పాటిస్తోంది. పూర్తి వివరాలు వెలువడితేనే ఈ ఒప్పందం ప్రభావం ఎంతవరకు ఉంటుందో స్పష్టమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
Redmi 15A 5G : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi కు చెందిన సబ్-బ్రాండ్ Redmi భారత మార్కెట్లో తన…
SRH Players : ఐపీఎల్ 2026 సీజన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్లో జరిగిన ఒక చిన్న సంఘటన…
PNG Connection : దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పైప్లైన్ నేచురల్ గ్యాస్ (PNG)పై ప్రజల్లో…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పద్ధతిలోనే ఇరాన్…
Revanth Reddy : తెలంగాణ అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు పూయించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రెండు అదిరిపోయే…
Modi on Iran : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఒక…
Dhurandhar 2 Collections : బాలీవుడ్ Bollywood స్టార్ హీరో రణవీర్ సింగ్ Ranveer Singh నటించిన లేటెస్ట్ యాక్షన్…
Garikapati Narasimha Rao : ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తన…
Vidadala Rajini : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజం కాబోతోందా? గత కొద్ది…
Gas Cylinder : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్…
Realme 5G : భారతదేశంలో స్మార్ట్ఫోన్ రంగం రోజురోజుకు విస్తరిస్తుండగా రియల్మీ బ్రాండ్ వేగంగా ఎదుగుతూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది.…
Rythu Bharosa : తెలంగాణలో సాగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు…
This website uses cookies.