
సంచలన నిర్ణయం... ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..!
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏ పెరుగుతుంది అనే విషయం తెలుసు కదా. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆ సమయంలో ఉన్న ద్రవ్యోల్బణం ఆధారంగా డీఏ పెరుగుతుంది. అయితే.. ఈ డీఏ జనవరి 2024 వచ్చే సరికి 50 శాతం దాటబోతోందని చెబుతున్నారు. ప్రస్తుతం డీఏ 42 శాతం ఉంది. ఇది జనవరి 2023 నుంచి అమలులోకి వచ్చింది. మళ్లీ జూన్ లో పెరగాల్సిన డీఏ.. ఇంకా పెరగలేదు కానీ.. రక్షా బంధన్ లేదా దసరా వరకు పెంచే చాన్స్ ఉంది. మరోసారి 4 శాతం డీఏ పెరగనుంది. అంటే.. 42 శాతం నుంచి 46 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
మళ్లీ వచ్చే సంవత్సరం అంటే జనవరి 2024 వరకు డీఏ కాస్త 50 శాతం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డీఏను ఏడో వేతన సంఘం సిఫారసు చేస్తోంది. కానీ.. త్వరలోనే ఎనిమిదో వేతన సంఘాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్యసభలో ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్న వేయగా.. దానికి సంబంధించిన సమాధానాన్ని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి చెప్పుకొచ్చారు.అయితే.. దానికి రిప్లయి ఇస్తూ ఇప్పట్లో కేంద్రం ఎనిమిదో వేతన సంఘాన్ని తీసుకొచ్చే ఆలోచన చేయడం లేదన్నారు. ఇప్పుడే కాదు.. ఇదివరకు కూడా కేంద్రం ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై స్పష్టతనిచ్చింది.
7th Pay Commission
ఇప్పట్లో ఎనిమిదో వేతన సంఘాన్ని తీసుకురావడం లేదని చెప్పింది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం ఆధారంగా, ఏఐసీఐపీ ఐడబ్ల్యూ ఇండెక్స్ ఆధారంగా లెక్కిస్తారని స్పష్టం చేశారు. అంటే.. ఇప్పట్లో ఎనిమిదో వేతన సంఘం లేనట్టే కానీ.. దానికి ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ మాత్రం వచ్చే సంవత్సరం 50 శాతం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Maha Shivratri : ఫిబ్రవరి 15, 2026న రానున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, శివాలయ సందర్శనలో భక్తులు పాటించాల్సిన…
Today Horoscope 15th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజు (ఆదివారం, 15 ఫిబ్రవరి 2026)…
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
This website uses cookies.